ఆయుధాలను తయారు చేయడంలో, నూతన టెక్నాలజీని వినియోగించి రోబోలను తయారు చేయడంతో ఇజ్రాయిల్ ముందు వరసలో ఉన్నది. ఆ దేశం తయారు చేసిన రాడార్ వ్యవస్థలను ఎన్నో దేశాలు వినియోగించుకుంటున్నాయి. కాగా, ఇప్పుడు ఇజ్రాయిల్ మరో కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. సరిహద్దుల్లో భద్రత కోసం రోబోటిక్ వాహనాలను తయారు చేసింది. మనిషి అవసరం లేకుండా ఈ వాహానాలు సరిహద్దుల్లో పహారా కాస్తుంటాయి. ఈ రోబోటిక్ వాహనాల్లో రెండు మెషిన్ గన్లు, కెమేరాలు, సెన్సార్లు అమర్చుతారు. రెక్స్ ఎంకే 2 పేరుతో సిద్ధం చేసిన ఈ రోబోటిక్ వాహనాలను ఎలక్ట్రానిక్ ట్యాబ్ ద్వారా కంట్రోల్ చేస్తారు. ఇజ్రాయిల్ ప్రభుత్వ సంస్థ ఇజ్రాయిల్ ఎరోస్పేస్ దీనిని తయారు చేసింది. ప్రస్తుతం ఈ సాయుధ రోబో వాహనాలను ఇజ్రాయిల్ సరిహద్దుల్లో వినియోగిస్తున్నారు.
Read: సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం: పోలీసులకు ఉచిత ప్రయాణం…