కోవిడ్ భయం ఇంకా వీడట్లేదా?
చైనాలోని వ్యూహాన్ నగరంలో కరోనా మహమ్మరి తొలిసారి వెలుగుచూసింది. గడిచిన ఏడాదిన్నరగా ఈ మహమ్మరి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనా ధాటికి లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కోట్లాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. కరోనా మొదటి దశలో అగ్రదేశాలైన అమెరికా, చైనా, బిట్రన్, ఇటలీ, ఫ్రాన్స్ ఎక్కువ నష్టపోవాల్సి వచ్చింది. కరోనా తొలి వేవ్ ను సమర్ధవంతంగా భారత్ సెకండ్ వేవ్ లో మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సైంటిస్టుల కృషి ఫలితంగా కోవిడ్ మహమ్మరికి వ్యాక్సిన్ రావడంతో ప్రపంచం ఈ భయానక పరిస్థితుల నుంచి బయటపడుతోంది.
కరోనా నివారణకు మనముందు ఏకైక లక్ష్యం వ్యాక్సిన్ తీసుకోవడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. కరోనాపై అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా రక్కసిపై పోరాడుతున్నారు. ఈ పోరులో ఎంతోమంది కోవిడ్ వారియర్లు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. వైద్య సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఫలితంగా కరోనాపై ప్రజలకు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖానికి మాస్కులు ధరించడం, చేతులను శానిటైజర్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటివి చేస్తున్నారు.
Also Read
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఉచితంగా చేస్తున్నారు. 18ఏళ్లు నిండిన ప్రతీఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచనలు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే తెలంగాణలోనూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఈ ఏడాది జనవరి 16 నుంచి ప్రారంభించారు. తొలినాళ్లలో వ్యాక్సిన్ కొరత కారణంగా తెలంగాణకు కొంతమందికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అయితే ఆ తర్వాత వ్యాక్సిన్ ఉత్పత్తి పెరగడంతో అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గత పదినెలలుగా తెలంగాణ కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు పోటీపడుతుండగా మరికొన్ని జిల్లాలో చాలా నెమ్మదిగా జరుగుతోంది.
కరోనా రెండు డోసులను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. ఇక చివరి స్థానంలో జోగులాంబ గద్వాల జిల్లా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో 27లక్షల 75వేల 505మంది టీకాకు అర్హులుండగా తొలి డోస్ వంద శాతం పూర్తికగా సెకండ్ డోస్ 50శాతం పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, మొబైల్ కేంద్రాల్లో కరోనా పంపిణీ స్పీడుగా జరుగుతోంది. అయితే కొంతమందిలో కరోనా టీకా వేసుకున్న తర్వాత స్వల్ప రియక్షన్స్ వస్తున్నాయి. దీంతో పలువురు టీకా వేసుకునేందుకు జంకుతున్నారు. ప్రతీఒక్కరూ కరోనా భయం వీడితే ఈ మహమ్మరిని మనమధ్య నుంచి తరిమివేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
-
Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
-
Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్లు రద్దు!
-
Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
-
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!