ఐఎన్ఎస్ ఖుక్రీ: 32 ఏళ్లలో 30 సార్లు ప్రపంచాన్ని చుట్టేసింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఎన్ఎస్ ఖుక్రీ… దేశంలో తయారైన మొదటి క్షిపణి సామర్థ్యమున్న యుద్ధనౌక. 1989 లో మజ్గావ్ డాక్లో తయారైంది. 1971 వ సంవత్సరంలో పాక్తో జరిగిన యుద్ధం సమయంలో అప్పటి ఖుక్రీ యుద్ధనౌకను అరేబియా సముద్రంలో పాక్ సైనికులు కూల్చివేశారు. ఆ తరువాత భారత్ కరాచీ రేవు పట్టణంపై బాంబుల వర్షం కురిపించి రేవును స్వాధీనం చేసుకోవడంతో పాక్ ఓటమిని అంగీకరించింది. అప్పటి ఖుక్రీ నౌక అందించిన సేవలకు గుర్తుగా దేశంలో తయారైన తొలి క్షిపణి యుద్ధనౌకకు ఐఎన్ఎస్ ఖుక్రీ అనే పేరును పెట్టారు. 32 ఏళ్లపాటు సేవలు అందించింది. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణం చేయగలదు.
Read: లైవ్: హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
Also Read
1989 ఆగస్టు 23 వ తేదీన ఈ యుద్ధనౌక జలప్రవేశం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నౌకలో 28 మంది కమాండింగ్ ఆఫీసర్లు విధులు నిర్వహించారు. 32 ఏళ్లలో 6,44,897 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణం చేసింది. అంటే ప్రపంచాన్ని 30సార్లు చుట్టి వచ్చినంత దూరం అన్నమాట. ఈ షిప్పులో పీ–20ఎం యాంటీషిప్ మిసైల్స్– 4, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్– 2, ఏకే–176 గన్ ఒకటి, ఏకే–630 గన్స్ రెండు ఉంటాయి. 32 ఏళ్లు నిర్వరామంగా విధులు నిర్వహించిన ఈ ఐఎన్ఎస్ ఖుక్రీ కి విశాఖలోని తూర్పు నౌకాదళంలో ఘనంగా వీడ్కోలు పలికారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!