ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించేందుకు కేంద్రం నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం చేదువార్తను అందించింది. డిసెంబర్ 31తో ముగుస్తున్న ఐటీఆర్ దాఖలు గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును ఎట్టి పరిస్థితుల్లో పొడిగించే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 5.62 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు.
Read Also: ఏడాదిలో చివరి రోజు… స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు
Also Read
మరోవైపు శుక్రవారంతో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు ముగియనుండటంతో డిసెంబర్ 30న గురువారం ఒక్కరోజే 24.39 లక్షల మంది ఐటీఆర్ దాఖలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఒక్క గంటలో 2.79 లక్షల మంది ఐటీఆర్ దాఖలు చేశారని తెలిపింది. కాగా ఈ ఏడాది కొత్తగా 60 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. చివరి రోజు కూడా భారీ సంఖ్యలో ఐటీ రిటర్న్స్ దాఖలవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకుంటే రూ.5 లక్షలకు పైగా ఆదాయం పొందే వారు రూ.5వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని అదనంగా లభించే బెనిఫిట్లను కూడా వదులుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..