Delhi Liquor Scam: ఢిల్లీలో హైటెన్షన్.. కేసీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని కేసీఆర్, కవిత ఇంటి ముందు భారీగా పోలీను మోహరించారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. నిన్ననే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు ఢిల్లీకి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత నివాసానికి ఇప్పటికే మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చేరుకున్నారు. ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, శంభిపుర్ రాజు కూడా కవిత ఇంటికి వచ్చారు. కవిత విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలతో భద్రతను పెంచారు. అంతేకాకుండా 144 సెక్షను విధించారు. పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
Also Read:Liquor Policy Case: ఆ ముగ్గురినీ కలిపి ప్రశ్నించే అవకాశం?
Also Read
పలువురు బీఆర్ఎస్ ఎంపీలు సైతం కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ నివాసంలో జాగృతి ప్రతినిధులకు కవిత అల్పాహారం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆడబిడ్డ ఆమెకు మద్దతు తెలిపేందుకు వచ్చామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దేశ విదేశాల్లో తెలంగాణ జాగృతి పేరిట అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవిత కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
కాగా, లిక్కర్ స్కామ్లో ఈడీ కస్టడీలో ఉన్న సిసోడియా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు, సౌత్గ్రూప్ను ఆపరేట్చేసిన వారిలో కవితదే కీలకమని ఈడీ స్పష్టం చేసింది. కవిత, మాగుంట శ్రీనివాస్ సౌత్ గ్రూప్కి నాయకత్వం వహించారని ఈడీ పేర్కొంది. 100 కోట్లు హవాలా మార్గాల్లో చెల్లించినట్లు సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో అరెస్ట్ అయిన పిళ్లై.. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీనని ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. అయితే, ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని కోర్టు పిటిషన్ వేశాడు. లిక్కర్ కేసులో ఈడీ ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసింది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం, సేకరించిన వివరాలు, ఆధారాలతో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించే అవకాశం ఉంది.
Also Read:Taneti Vanitha: విపత్తులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం
ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది. మార్చి 9వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే, ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో మార్చి 11న విచారణకు హాజరవుతానని కవిత సమాచారం అందించారు. దీంతో ఈరోజు విచారణ తేదీని ఈడీ అధికారులు ఖరారు చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ శుక్రవారం ఢిల్లీలో తన నిరాహారదీక్షను చేశారు. ఈ రోజు ఈడీ విచారణకు హాజరువుతున్నారు.
- Tags
- BRS
- cm kcr
- ED
- Kavitha
- Liquor Policy Case
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!