Heatwave: దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలు.. ఆ రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఎండలు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.వేసవి తాపానికి తాళలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. అయితే, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతంలోనూ ఎండలు తీవ్రస్థాయిలో ఉంటాయి భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 19 మధ్య కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో ఉరుములు, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో సాధారణ కంటే ఎక్కువ వేడిగా ఉండే రోజులను అంచనా వేసింది.
Also Read:AP Politics: హస్తినలో ఏపీ రాజకీయం.. మొన్న పవన్, నేడు సోము.. ఏం జరుగుతోంది?
రాబోయే ఐదు రోజులపాటు దేశంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్లో బీహార్, జార్ఖండ్, తూర్పు మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఛత్తీస్గఢ్, పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ , హర్యానాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మార్చిలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. IMD డేటా ప్రకారం, భారతదేశం మొత్తం మార్చిలో 37.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
Also Read:Bajireddy Govardhan Reddy : ఈడీ, ఐటీ దాడులు చేయించే ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు సహకరించాలి
మార్చిలో చల్లని వాతావరణం ఉన్నప్పటికీ, ఏప్రిల్, మే, జూన్లలో మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడి గాలులు ఉంటాయని అంచనా వేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండల తీవ్ర అధికం అవుతుందని ఐఎండీ చెప్పింది. ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 4.5-6.4 సెల్సియస్ పెగుతుందని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!