Joshimath disaster: హోటళ్లు ఖాళీ చేయండి.. జోషిమఠ్ విపత్తు బాధితులకు యజమానుల అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ను ఉపద్రవం తాకి దాదాపు మూడు నెలలైంది. అయితే విపత్తు బాధిత ప్రజల బాధలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. జోషిమఠ్ బాధితులు తమ హోటళ్లు ఖాళీ చేయాలని యజమానులు అల్టిమేటం జారీ చేశారు. చమోలీ జిల్లాలోని జోషిమఠ్లో భూమి క్షీణించడం వల్ల ఇళ్లలో పగుళ్లు ఏర్పడిన తరువాత బాధితులను స్థానిక హోటళ్లకు తరలించారు అక్కడి అధికారులు. అయితే, మార్చి 31 లోగా హోటల్ గదులను ఖాళీ చేయాలని హోటల్ యజమానులు కోరారు.రాష్ట్రంలో చార్ధామ్ తీర్థయాత్ర ప్రారంభం అవుతోంది. చార్ధామ్ యాత్ర కోసం భక్తులు,పర్యాటకులు భారీగా రానున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ యజమానులు హోటల్ గదులు ఖాళీ చేయాలని ఆదేశించారు. అయితే, బాధిత ప్రజలను హోటళ్లలో ఉంచడానికి గడువు పొడిగించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.
Also Read:Ajay Banga: ప్రపంచ బ్యాంకు చీఫ్గా భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఎన్నిక!
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ఈ ఏడాది జజనవరి మొదటి వారంలో జోషిమఠ్లో భూమి మునిగిపోవడంతో ప్రజలు హోటళ్లు, ధర్మశాలలు, అద్దె ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. హోటళ్లలో రూ.950 అద్దె ప్రభుత్వం చెల్లిస్తోంది. అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి రూ.ఐదు వేలు ఇస్తున్నారు. జోషిమత్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ హోటళ్లు, ధర్మశాలల్లో 181 కుటుంబాలకు చెందిన 694 మంది సభ్యులు ఉన్నారు. వారికి భోజన, పానీయాల ఏర్పాట్లు కూడా చేశారు. విపత్తు బాధిత ప్రజలు మార్చి 31 వరకు హోటళ్లలో బస చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. చివరి తేదీ దగ్గర పడుతుండటంతో, హోటల్ యజమానులు బాధితులను గదులు ఖాళీ చేయమని చెప్పడం ప్రారంభించారు.
తన హోటల్లో 10 గదులు ఉన్నాయని యజమాని గోవింద్ సింగ్ చెప్పారు. వీటిలో రెండు గదులను విపత్తు ప్రభావితులకు కేటాయించారు. మార్చి వరకు ఆశ్రయం కల్పించాలని అధికారులు కోరారు. ఇప్పుడు వారికి చార్ ధామ్ యాత్రకు వచ్చే పర్యటకుల కోసం గదులు కావాలి. చాలా సార్లు యాత్రికులు పెద్ద సమూహాలు వస్తారు. అటువంటి పరిస్థితిలో, విపత్తు ప్రభావిత ప్రజలను ఇక్కడ ఉంచితే, వారు యాత్రికులకు గదులు ఇవ్వలేరు.
Also Read:Covid cases: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 3 వేలు దాటిన కేసులు
మరో హోటల్ యజమాని కులదీప్, తన హోటల్లో ఆరు గదులు ఉన్నాయని, అందులో మూడు విపత్తుల బారిన పడిన వారికి ఇచ్చామని చెప్పారు. ఒక గదికి రోజుకు రూ. 950 ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు. ఇప్పుడు చార్ధామ్ యాత్ర దృష్ట్యా గదులు ఖాళీ చేయాల్సి ఉంటుందని కుల్దీప్ తెలిపారు. విపత్తు ప్రభావిత ప్రజలను మార్చి 31 వరకు హోటళ్లకు తరలించాలని (రాష్ట్ర ప్రభుత్వం నుండి) ఆదేశాలు అందాయని జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా అన్నారు. ఏప్రిల్ 30 వరకు ప్రభావితమైన వారిని హోటళ్లలో ఉంచాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు.
Also Read:TSPSC Paper Leakage Case: పేపర్ లీకేజ్ కేసు.. ఆ ముగ్గురి ఇళ్లల్లో సిట్ సోదాలు..?
మార్చి 31 తర్వాత కూడా విపత్తు ప్రభావిత బాధితులను హోటళ్ల నుండి మినహాయించరు. ఒక హోటల్ యజమాని బాధిత ప్రజలను హోటల్ నుండి వెళ్లిపోవాలని కోరితే, దానిపై విచారణ జరుగుతుంది ”అని ఆయన నొక్కి చెప్పారు. మరోవైపు విపత్తు ప్రభావిత బాధితులను హోటళ్లలో ఉంచడానికి తమకు మార్చి 31 వరకు అనుమతి ఉంది అని SDM కుంకుమ్ జోషి తెలిపారు. గడువు పొడిగించాలని ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. చాలా హోటళ్లకు అద్దె చెల్లించారని, అయితే, కొన్ని హోమ్ స్టేలు, హోటళ్లకు సంబంధించిన జిఎస్టి , ఇతర డాక్యుమెంటేషన్లు పూర్తి కానందున, అద్దె చెల్లించలేదని చెప్పారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!