Vande Mataram: స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన ‘వందేమాతరం’.. ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
150 Years Of Vande Mataram: వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయింది. నేడు వందేమాతరంపై పార్లమెంట్లో 10 గంటల పాటు చర్చ ఉండనుంది. ‘వందేమాతరం’ గేయాన్ని బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచారు. దీన్ని తన ‘ఆనందమఠం’ నవలలో చేర్చారు. ఇది 1875 నవంబర్ 7న ప్రచురితమైంది. ఇందులో భారతమాతను దేవతగా అభివర్ణించారు. 1896లో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా వందేమాతరాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. దీంతో ఇది స్వాతంత్య్ర ఉద్యమంలో ఫేమస్ అయింది. నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, ఆచార్య నరేంద్ర దేవ్లతో కూడిన కమిటీ 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కీలక సిఫార్సుతో నివేదిక ఇచ్చింది. ‘వందేమాతరం’లోని మొదటి రెండు చరణాలను మాత్రమే సంబంధితంగా ఉన్నాయని, వాటివల్ల ఎవరి మతపరమైన మనోభావాలు దెబ్బతినవని తెలిపింది. అయితే ముస్లిం లీగ్, కొన్ని ఇతర గ్రూపులు ఆ రెండు చరణాలలోని కొన్ని పద్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వందేమాతర గేయంలోని మొదటి రెండు చరణాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది.
READ MORE: Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’ టీమ్ నుంచి అప్డేట్..!
Also Read
- August 15 History: ఆగస్టు 15.. భారత్కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- India Constitution Day History: మీకు తెలుసా! భారత తొలి గణతంత్ర పరేడ్కు ముఖ్య అతిథిగా పాకిస్థాన్ గవర్నర్ జనరల్..
- What's Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
వందేమాతర గేయం గురించి భారత రాజ్యాంగ సభలో విభేదాలు తలెత్తాయి. 1947 ఆగస్టు 14న రాత్రి భారత రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఆ సమావేశం ‘వందేమాతరం’ ఆలాపనతో ప్రారంభమై, ‘జన గణ మన’తో ముగిసింది. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభలో రెండు గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ‘జన గణ మన’ జాతీయ గీతంగా, ‘వందేమాతరం’ జాతీయ గేయంగా ఉంటాయని ప్రకటించారు. ఈ రెండింటికి సమాన గౌరవం లభిస్తుందని వెల్లడించారు.
అయితే.. కొంతమంది ముస్లింలు వందేమాతరాన్ని వ్యతిరేకిస్తారు. వందేమాతరం గేయాన్ని ఆలపించడం ఇస్లామిక్ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకమని ముస్లిం సమాజంలోని కొందరు వాదిస్తున్నారు. ఈ గేయంలో దుర్గాదేవి స్తుతి ఉందని వారు అంటున్నారు. వ్యక్తులు, వస్తువులను ముస్లింలు పూజించరని వారు చెబుతున్నారు. ముస్లింలు షరియా చట్టం ఆదేశాలను పాటిస్తాయి.. వందేమాతరం గేయంలోని పదాలతో, ఇస్లామిక్ సూత్రాలకు పొంతన కుదరదని కొందరి ముస్లింల వాదన.. ముస్లింలు వందేమాతరం గీతాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం.. ఇస్లాం “ఏకేశ్వరోపాసన” సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. అయితే ఈ గీతంలోని కొన్ని భాగాలలో ‘భారతమాత’ను దేవతగా కీర్తించడం (హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి వంటి వాటితో పోల్చడం) ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధమని, ఇది బహుదేవతారాధన (షిర్క్) కిందకు వస్తుందని వారు భావిస్తారు. దేశభక్తిని మాతృభూమికి చూపించడం వేరు, దానిని ఒక దేవతగా పూజించడం వేరు అని ముస్లిం సంస్థలు వాదిస్తున్నాయి. ఈ కారణంతోనే వారు ఈ గీతంలోని కొన్ని పద్యాలను వ్యతిరేకిస్తారు. ఏకేశ్వరోపాసన (Tawhid) అంటే ఏంటి..? ఇస్లాం ప్రకారం, అల్లాహ్ (దేవుడు) తప్ప మరెవరినీ పూజించకూడదు. వందేమాతరం గీతంలోని “సుజలాం సుఫలాం, మలయజ శీతలాం” వంటి భాగాల తర్వాత వచ్చే పద్యాలు మాతృభూమిని దుర్గా, లక్ష్మి వంటి దేవతలతో పోల్చుతాయి. ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని కొందరు ముస్లింలు భావిస్తారు. ఈ కారణాల వల్ల చాలా మంది ముస్లింలు వందేమాతరం గీతాన్ని ఆలపించడానికి ఇష్టపడరు..
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!