అతి వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలో థర్డ్ వేవ్కి దారితీస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే పదిహేడు కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. టాంజానియా నుంచి వచ్చిన రాంచీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తి కొత్త మహమ్మారి బారిపడ్డాడు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ అతనికి ఒమైక్రాన్ సోకింది. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స పొందుతున్నాడు.
జైపూర్లో తొమ్మిది ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వారిలో, ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఉన్నారు. మొత్తం తొమ్మిది మందికి కొత్త వేరియంట్ సోకినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్ధారించిందని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
మహారాష్ట్రలో ఏడు ఒమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. పుణె శివార్లలో ఒక కుటుంబంలోని ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీరంతా గత నెలలో నైజీరియా నుంచి తిరిగి వచ్చారు. ఏడవ కేసు ఒక వ్యక్తి గత నెలలో ఫిన్లాండ్కు వెళ్లటంతో కాంటాక్ట్ అయింది. దాంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
అంతకు ముందు కర్నాటకలో రెండు కేసులు బయటపడ్డాయి.శనివారం గుజరాత్కు చెందిన 72 ఏళ్ల ఎన్ఆర్ఐతో పాటు, మహారాష్ట్రలోని థానేకి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని ఈ కొత్త వేరియంట్ సోకింది.
మరోవైపు, కొత్త వేరియంట్ యూరప్ అంతటా విస్తరిచింది. కేసుల సంఖ్య వేగంగా పెరుగతోంది. ఆదివారం బ్రిటన్, డెన్మార్క్లో డజన్ల కొద్దీ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వైరస్ విస్తృతంగా వ్యాపించటంతో యూరప్ భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటోంది.ఆదివారం బ్రిటన్లో కొత్తగా 86 ఒమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. దాంతో ఇప్పటి వరకు కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 246కి చేరింది. డెన్మార్క్లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజగా 183 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని మాత్రం స్పష్టమైంది.
ఈ కొత్త మహమ్మారి అప్పుడే 45 దేశాలకు వ్యాపించింది. అమెరికాలోనూ ఇది వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు 20 రాష్ట్రాలకు పాకింది. అయితే ఇది దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనే దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఐతే, అనేక దేశాలు ఇప్పటికే ప్రయాణ పరిమితుతో పాటు అనేక ఇతర ఆంక్షలు విధించాయి.
ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ దేశాలలో వారాంతపు రోజులలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మహమ్మారి అక్కడ ఉప్పెనలా విరుచుకుపడింది. ఇప్పుడు దీనికి ఒమైక్రాన్ తోడైంది. దాంతో వింటర్ సీజన్లో కష్టాలు తప్పేలా లేవు. ఊహించిన దానికంటే పరిస్థితి భయంకరంగా ఉంటుందేమోననే భయాలు జనాన్ని వెంటాడుతున్నాయి.
వింటర్ సీజన్ ప్రారంభంతోనే పశ్చిమ దేశాలలో క్రిస్మస్ సంబరాలు మొదలవుతాయి. ఐతే, ఈ వేడుకలే ఇప్పుడు సూపర్ స్ప్రెడర్స్గా మారుతున్నాయి. నార్వే గత నెల చివరి వారంలో జరిగిన ఓ క్రిస్మస్ పార్టీలో పాల్గొన్న 120 మందిలో 100 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు.
ఇది ఇలావుంటే, బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నెగెటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్ర వైద్య అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ ఈ నెల 1న యూకే నుంచి వచ్చింది. కరోనా పరీక్షలో ఆమెకు పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమె నమూనాను జీనోమ్ సీక్వెన్స్ కు పంపటంతో ఒమిక్రాన్ నెగిటివ్గా తేలింది.
మరోవైపు, తెలంగాణలో సంక్రాంతి తర్వాత కరోనా కేసులు పెరుగుతాయంటోంది వైద్య ఆరోగ్య శాఖ. ఫిబ్రవరి నాటికి కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరే అవకాశం ఉంది. విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్లు పెరుగుతున్నాయని వైద్య అధికారులు చెపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితాలోని 12 దేశాల నుంచి ఇప్పటివరకు హైదరాబాద్కు 900 మందిపైగా వచ్చారు. ఏర్పోర్టులలో నిర్వహించిన టెస్టుల్లో 13 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపించారు. ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయి. కాబట్టి తెలంగాణలో ఏ క్షణమైనా ఒమిక్రాన్ కేసులు బయటపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి.
మరోవైపు, ఒమిక్రాన్ సోకినవారిలో ఒళ్లు నొప్పులు, తల నొప్పి, నీరసం ఉండే అవకాశం ఉంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్పయ రీక్షలు చేయించుకోవాలి.
మరోవైపు, ఇకపై వెలుగు చూసే మహమ్మారి ఏదైనా కోవిడ్ -19 కంటే ప్రాణాంతకంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కోవిడ్-19 నుంచి నేర్చుకున్న పాఠాలను వృధా చేయకుండా వాటి దాడిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం కలిగించింది. కోట్లాది మంది జీవితాలను తలక్రిందులు చేసింది. కాబట్టి ఒమైక్రాన్ విషయంలో ఇప్పటికైతే జాగ్రత్తగా ఉండటం మినహా మరో మార్గంలేదు. కాబట్టి మాస్క్ ధరించటం..భౌతిక దూరం పాటించటం ..తరచూ చేతులు శుభ్ర పచరుకోవటం మర్చిపోద్దు!!
తాజావార్తలు
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..