పాకిస్తాన్లోని కరాచీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. కరాచీలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్లోని ఓ భవనంలో పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుళ్లలో 10 మంది మృతి చెందారు. భారీ పేలుడు ధాటికి పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read: శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న సూపర్ స్ట్రెయిన్…ఆ రెండూ కలిస్తే…
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పెలుడు జరిగిన బిల్డింగ్ కు సమీపంలో ఓ బ్యాంకు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే, పేలుడు భారీస్థాయిలో ఉండటంతో ఇది ఉగ్రవాదుల పనే అనే అనుమానాలు కలుగుతున్నాయని పాక్ మీడియా తెలియజేసింది.
14 killed in Karachi bomb blast in Pakistan. pic.twitter.com/lNmaryA5dp
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 18, 2021