land for jobs case: స్పీడ్ పెంచిన ఈడీ.. లాలూ ప్రసాద్ కుమార్తెపై ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వేలో ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె చందా యాదవ్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు గురువారం నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే లాలూ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ను ఢిల్లీలోని కేంద్ర ఏజెన్సీ కార్యాలయంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. బుధవారం, లాలూ మరో కుమార్తె ఎంపీ మిసా భారతిని ప్రశ్నించారు.
Also Read: Breaking: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత…
యూపీఏ-1 ప్రభుత్వంలో ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న కాలానికి సంబంధించిన ఈ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. 2004-09లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు, లబ్ధిదారుడైన ఎకె ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు భూమిని బదలాయించి వివిధ వ్యక్తులను రైల్వేలో గ్రూప్ డి స్థానాల్లో నియమించారని ఏజెన్సీలు ఆరోపించాయి. ఇటీవల ఆర్జెడి చీఫ్ కుటుంబంపై ఈడీ దాడులు నిర్వహించింది. గత నెలలో పాట్నా, ఫుల్వారీ షరీఫ్, ఢిల్లీ-ఎన్సిఆర్, రాంచీ, ముంబైలలో చందా యాదవ్, ఆమె సోదరీమణులు రాగిణి యాదవ్, హేమా యాదవ్, మాజీ ఆర్జేడీ ఎమ్మెల్యే అబు డోజానాపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాడి చేసింది. సోదాల అనంతరం కోటి రూపాయల లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నట్లు, 600 కోట్ల రూపాయల విలువైన నేరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో తేజస్వి యాదవ్ను ఈడీ సోమవారం ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ కేసులో మార్చి 25న తేజస్వి యాదవ్ సీబీఐ విచారించిన అదే రోజున మిసా భారతిని కూడా ఈడీ ప్రశ్నించింది.
Also Read
తాజావార్తలు
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!