land for jobs case: స్పీడ్ పెంచిన ఈడీ.. లాలూ ప్రసాద్ కుమార్తెపై ప్రశ్నలు
రైల్వేలో ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె చందా యాదవ్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు గురువారం నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే లాలూ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ను ఢిల్లీలోని కేంద్ర ఏజెన్సీ కార్యాలయంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. బుధవారం, లాలూ మరో కుమార్తె ఎంపీ మిసా భారతిని ప్రశ్నించారు.
Also Read: Breaking: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత…
యూపీఏ-1 ప్రభుత్వంలో ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న కాలానికి సంబంధించిన ఈ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. 2004-09లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు, లబ్ధిదారుడైన ఎకె ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు భూమిని బదలాయించి వివిధ వ్యక్తులను రైల్వేలో గ్రూప్ డి స్థానాల్లో నియమించారని ఏజెన్సీలు ఆరోపించాయి. ఇటీవల ఆర్జెడి చీఫ్ కుటుంబంపై ఈడీ దాడులు నిర్వహించింది. గత నెలలో పాట్నా, ఫుల్వారీ షరీఫ్, ఢిల్లీ-ఎన్సిఆర్, రాంచీ, ముంబైలలో చందా యాదవ్, ఆమె సోదరీమణులు రాగిణి యాదవ్, హేమా యాదవ్, మాజీ ఆర్జేడీ ఎమ్మెల్యే అబు డోజానాపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాడి చేసింది. సోదాల అనంతరం కోటి రూపాయల లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నట్లు, 600 కోట్ల రూపాయల విలువైన నేరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో తేజస్వి యాదవ్ను ఈడీ సోమవారం ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ కేసులో మార్చి 25న తేజస్వి యాదవ్ సీబీఐ విచారించిన అదే రోజున మిసా భారతిని కూడా ఈడీ ప్రశ్నించింది.
Also Read
తాజావార్తలు
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!