చిరుతవేగం… పూరి జగన్నాథ్ సొంతం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ పుట్టినరోజు)
ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో స్పీడున్నోడు ఎవరంటే పూరి జగన్నాథ్ పేరే చెబుతారు. ఈ తరం డైరెక్టర్స్ లో అతి తక్కువ సమయంలో క్వాలిటీ చూపిస్తూ సినిమాలు రూపొందించడంలో తాను మేటినని నిరూపించుకున్నారు పూరి జగన్నాథ్. మొదటి నుంచీ పూరి జగన్నాథ్ ఆలోచనా సరళి భిన్నంగా ఉండేది. ఆయన చిత్రాల్లోని ప్రధాన పాత్రలు సైతం విచిత్రంగా ఆకట్టుకొనేవి. అందువల్లే పూరి జగన్నాథ్ అనగానే వైవిధ్యమైన దర్శకుడు అనే పేరు సంపాదించారు. తొలి చిత్రం బద్రిలోనే తన సత్తా ఏమిటో చాటుకున్నారు పూరి. ఆ తరువాత అదిరిపోయే హిట్సూ అందించారు. ఆపై బెదిరేలా చేసిన ఫట్సూ చూపించారు. ఏది చేసినా అందులో తనదైన బాణీ మాత్రం పలికించారు పూరి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో విజయ్ దేవర కొండ హీరోగా లైగర్ తెరకెక్కిస్తున్నారు పూరి. ఈ చిత్రంతో మళ్ళీ డైనమిక్ డైరెక్టర్ అన్న తన పేరును నిలుపుకొనే ప్రయత్నంలో ఉన్నారాయన.
పూరి జగన్నాథ్ తొలి చిత్రం బద్రి జనం ముందు నిలచి అప్పుడే 21 సంవత్సరాలయింది. అయినా ఈ నాటికీ పూరి జగన్నాథ్ తన ప్రతి చిత్రాన్నీ మొదటి సినిమాగా భావించి తెరకెక్కిస్తున్నారు. జయాపజయాలకు అతీతంగా పూరి సినిమా ప్రస్థానం సాగుతోంది. ఇప్పటికీ జనం పూరి జగన్నాథ్ సినిమా అనగానే అందులో ఏదో ఒక వైవిధ్యం ఉంటుందని భావిస్తున్నారు. పూరి జగన్నాథ్ రెండో సినిమా బాచీ బాల్చీ తన్నేసినా, మూడో చిత్రం కన్నడ సినిమా యువరాజతో విజయం సాధించారు. తన నాలుగవ సినిమా ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యంతో పూరి జగన్నాథ్ తన మార్కేమిటో స్పష్టంగా చూపించారు. ఈ సినిమాతో రవితేజ స్టార్ హీరో అయిపోయాడు. రవితేజతో వరుసగా ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వంటి విజయాలు చూశారు పూరి. దాంతో స్టార్ హీరో నాగార్జునను శివమణిలో డైరెక్ట్ చేసి, విజయం సంపాదించారు పూరి. జూనియర్ యన్టీఆర్ తో తెరకెక్కించిన ఆంధ్రావాలా ఆడలేదు. ఆ తరువాత వచ్చిన పూరి చిత్రాలు వన్ ఫోర్ త్రీ, సూపర్ కూడా మురిపించలేక పోయాయి. కొందరు పూరి పని అయిపోయిందనీ భావించారు. అప్పుడు కొట్టాడు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్. అదే మహేశ్ బాబుతో పూరి తెరకెక్కించిన పోకిరి. ఈ సినిమా అనేక కేంద్రాలలో వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు, తరిగిపోని చెరిగిపోని రికార్డులు నెలకొల్పింది. ఆ తరువాత అల్లు అర్జున్ తో పూరి తెరకెక్కించిన దేశముదురు అప్పటికి బన్నీ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచింది. రామ్ చరణ్ తొలి చిత్రం చిరుతను రూపొందించిందీ పూరియే. తరువాత తెరకెక్కిన పూరి జగన్నాథ్ చిత్రాలేవీ పోకిరి స్థాయి విజయాన్ని మూటకట్టుకోలేక పోయాయి.
Also Read
పూరి జగన్నాథ్ మాత్రం పట్టువదలని విక్రమార్కునిలా ముందుకు సాగుతూనే ఉన్నారు. తన పోకిరి హీరో మహేశ్ తో తీసిన బిజినెస్ మేన్, తన తొలి చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన కెమెరామెన్ గంగతో రాంబాబు, తిరుగులేని మాస్ హీరో బాలకృష్ణతో రూపొందించిన పైసా వసూల్ అంతగా మురిపించలేకపోయాయి. ప్రభాస్ తో తీసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సైతం అలరించలేకపోయాయి. జూనియర్ యన్టీఆర్ తో తొలి సినిమా ఫ్లాప్ ఇచ్చినా, రెండో చిత్రం టెంపర్తో ఓ డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నారు పూరి. దాని తరువాత మళ్ళీ మామూలే ఫ్లాపులు పలకరించాయి. ఆ పై రామ్ తో ఇస్మార్ట్ శంకర్ తీసి మళ్ళీ జనాన్ని ఆశ్చర్య పరిచారు. ఈ సినిమా రామ్ కెరీర్ లోబిగ్ హిట్ గా నిలచింది. ఇలా కెరీర్ లో పలు ఎత్తులు పల్లాలు చూసిన పూరి జగన్నాథ్ రాబోయే లైగర్తో ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి లైగర్ ఎప్పుడు జనం ముందు నిలుస్తాడో, వారి మనసులు ఏ తీరున గెలుస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!