చిత్రసీమకు బంగారపు కడ్డి… కేవీ రెడ్డి!
(జూలై 1న కేవీ రెడ్డి జయంతి)
చారిత్రకంతోనే తొలి ఢీ
జానపదాలలో గారడి
పురాణాలతో భలే సందడి
సాంఘికాలలోనూ సవ్వడి
ఇలా చేసిన ఘనుడు కేవీ రెడ్డి! తొలి చిత్రం ‘భక్త పోతన’లోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు కేవీ. ‘గుణసుందరి’లో తెలుగు షేక్సిపియర్ గా మారిన కేవీ, ‘పాతాళభైరవి’తో చూపించారు మరింత ఠీవి. ఇక ‘మాయాబజార్’తో చేసిన సందడిని ఎవరు మాత్రం మరువగలరు? ‘చిగురాకులలో చిలకమ్మలకు చిన్నమాటలు వినిపించిందీ’ కేవీగారి ‘దొంగరాముడే’. సమాజంలోని ‘పెద్దమనుషుల’ బాగోతాలు అప్పట్లోనే విప్పి చెప్పిన తెలుగువారి ఇబ్సన్ కూడా ఆయనే!
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
కొందరు ఏది చేసినా భలే బాగుంటుంది. మరికొందరు ఎన్ని తీసినా చూడలేం. కేవీ రెడ్డి తీసిన చిత్రాల జయాపజయాలను పక్కకు పెడితే, ఆయన తెరకెక్కించిన సినిమాల్లో అధికశాతం ఆకట్టుకున్నవే! నాటకఫక్కీలో సాగుతున్న తెలుగు సినిమాకు కూడా ఓ సరికొత్త వ్యాకరణం అవసరమని కేవీ భావించారు. అంతకు ముందు మన సినిమాల్లో నాటకఫక్కీనే పలకరించేది. గూడవల్లి, బి.యన్.రెడ్డి వంటివారు కూడా తెలుగు సినిమా గ్రామర్ ను మార్చినవారే! అయితే వారికన్నా మిన్నగా కేవీ రెడ్డి బోధించిన సినిమా వ్యాకరణం జనానికి భలేగా పట్టేసింది. ‘జై పాతాళభైరవీ’ అన్నారు కేవీ. అమ్మవారు, ‘నరుడా ఏమి నీ కోరిక’ అని ప్రశ్నించారు. జనాన్ని మెప్పించే చిత్రాలను తీయాలన్నదే తన అభిలాష అని చెప్పినట్టుంది. అమ్మవారి అనుగ్రహంతో కడదాకా జనం మెచ్చే చిత్రాలనే తెరకెక్కించారు కేవీ.
‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో ఇద్దరు మేరునగ సమానులైన నటులతో అలరించిన కేవీ రెడ్డి, ఆ తరువాత ఎందుకనో అంతగా ఆకట్టుకోలేక పోయారు. ‘సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము’ వంటి చిత్రాలు చూసి, ఇవి కేవీ తీసిన సినిమాలేనా అని ఆ రోజుల్లో ఆశ్చర్యపోయిన వారున్నారు. అవి కేవీ తీసిన చిత్రాలే, కానీ, వాటిలో ఆయన ఠీవి కనిపించలేదన్నదే అభిమానుల ఆవేదన. కొందరు కేవీ పని అయిపోయిందన్నారు. మరికొందరు ఆయన గత చిత్రరాజాలనే తలచుకొని పులకించిపోయారు. మళ్ళీ ఏ మాయాబజారునో, లేదా ఏ జగదేకవీరుని కథనో వినిపిస్తారని ఆశించారు. అభిమానులు మాత్రం ఏదో ఒక రోజున కేవీ మునుపటి వైభవం చూపిస్తారనే విశ్వసించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ‘శ్రీకృష్ణ సత్య’ను తెరకెక్కించారు కేవీ. మళ్ళీ ఆయన ఠీవి నిలచింది. ‘శ్రీకృష్ణ సత్య’నే ఆయన చివరి చిత్రం. విచిత్రమేంటంటే- ‘మాయాబజార్’తో యన్టీఆర్ ను అపరశ్రీకృష్ణునిగా నిలిపిన కేవీ, ఈ తెరకృష్ణుడు నిర్మించిన ‘శ్రీకృష్ణసత్య’తోనే చిత్ర ప్రయాణం ముగించడం! ఏది ఏమైనా విజయంతో మొదలైన కేవీ సినీయానం సక్సెస్ తోనే ముగియడం అభిమానులకు ఆనందం పంచింది. జానపదాల ప్రసక్తి వచ్చిన ప్రతీసారి కేవీ బాణీ కోసం వెదుక్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితి ఈ నాటి సినీజనానికీ తప్పడం లేదు. అందుకే కేవీ రెడ్డి పేరు ఇంకా ఠీవీగానే చిత్రసీమలో నిలచి ఉందని అంటారు! కాదంటారా!?
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో