పెరిగిన కాలుష్యం.. డేంజర్ జోన్ లో ఢిల్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే కాలుష్యం.. ఆపై దీపావళి తోడైంది. దీంతో దేశ రాజధాని ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీ లోని వాహనాలు, నిర్మాణాలు, రహదారులు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు, పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత, బొగ్గు ఆధారిత విద్సుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యం ఇబ్బందుల పాలు చేస్తోంది. దీనికి తోడు దీపావళి పండుగ కాలుష్యం కూడా తోడవడంతో పరిస్థితి విషమించింది.
ధూళి అణువులు 2.5 మైక్రాన్స్ పరిమాణంలో ఉన్న ధూళి అణువుల సాంద్రత పెరగడం మూలంగా “ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 400 నుంచి 500 వరకు నమోదౌతోంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 457 గా నమోదైంది. గత మూడేళ్ళలో ఇది గరిష్టం అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఒక క్యూబిక్ మీటర్ లో 2.5 మైక్రాన్స్ పరిమాణంలో ఉన్న ధూళి అణువులు 457 ఉన్నట్లు లెక్క.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ఇటు ఆందోళనలకు కేంద్రబిందువైన జంతర్ మంతర్ వద్ద ఎయుర్ క్వాలిటీ 341 ఉన్నట్లు నమోదయింది. ఆదివారం సాయంత్రం నుంచి క్రమేపి కాలుష్య తీవ్రత తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్న “సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్” తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 100 లోపు నమోదైతేనే దేశ రాజధాని పౌరులకు ఊరట కలిగే అవకాశం వుందంటున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 25 ఉంటేనే క్షేమకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఛాతి సమస్యలు, గుండె జబ్బులున్న వారికి ఈ కాలుష్యం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు వైద్యులు.
“కోవిడ్-19” బారిన పడి ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారికి కూడా ఈ కాలుష్యం ప్రాణాంతకం అని అంటున్నారు వైద్యులు. 10 నుంచి 15 శాతం బాలబాలికలు ఆస్థ్మా తో బాధపడుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల గుండె, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందనిహెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రపంచంలోని అన్ని రాజధానుల్లో కెల్లా ఢిల్లీ అత్యంత ప్రమాదకరమైన “గాలి నాణ్యత” ఉన్న దేశ రాజధాని గా పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ పౌరులు ముంచుకొస్తున్న ప్రమాదకర పరిస్థితిని ఏ మాత్రం అర్ధం చేసుకోవడం లేదు. యధేచ్ఛగా అన్ని నిషేదాజ్ఞలను ఉల్లంఘించి “దీపావళి” క్రాకర్స్ ను కాల్చి విషతుల్యమైన కాలుష్యానికి కారణమౌతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ నిపుణులు.
తాజావార్తలు
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!