హుజురాబాద్ లో దళిత బంధు ఫీవర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు ఫీవర్ పట్టుకుంది. కొద్ది రోజులుగా లబ్ధిదారులు బ్యాంకుల ముందు బారులుతీరుతున్నారు. పెద్ద ఎత్తున బ్యాంకుకు తరలివస్తుండటంతో కొన్ని సార్లు పరిస్థితి గంధరగోళానికి దారితీస్తోంది.
చాలా మంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో ఆ మొత్తం జమ అయిందో లేదో తెలుసుకోవలన్న ఆసక్తితో బ్యాంకుకు వెళుతున్నారు. దళితబంధుపథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 23 వేల మంది అర్హులను గుర్తించింది. అయితే ఇప్పటి వరకు 16 వేల ఖాతాలు మాత్రమే తెరిచారు. ఏడు వేల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు ఇంకా తెరవకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన అందరికీ వారు ఇష్టపడే వ్యాపార యూనిట్లకు సంబంధించిన నిధులు, లావాదేవీలను లింక్ చేయడానికి ప్రభుత్వం కొత్త ఖాతాలను తెరవాలని నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి అవసరం కావచ్చు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
దళిత బంధు స్కీంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ డబ్బులు అకౌంట్లలో జమ చేసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఖాతాల్లో 9 లక్షల 90 వేలు జమ చేశారా లేదా అనే దాని పై ఆరా మొదలైంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో తమకు రావల్సిన డబ్బులు రావేమోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఈ మేరకు ప్రచారం కూడా జరగడంతో లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్లో అమలు చేస్తున్న దళిత బంధు కోసం డబ్బులను కలెక్టర్ అకౌంట్కు బదిలీ చేసింది. అయినప్పటికీ తమ చేతికి రాకపోతే ఎలా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.
వ్యాపారం చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్నా తన అకౌంట్కు డబ్బు రాలేదని కొందరు అంటున్నారు. అకౌంట్లో డబ్బు జమ అయినట్టు మొబైల్కు మెసేజ్ వచ్చినా ఖాతాలో మాత్రం డబ్బు డిజాజిట్ కాలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హుజురాబాద్ ఉపఎన్నిక ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీకి సవాలుగా మారటంతో నియోజకవర్గంలో నిధుల వరద పారుతోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా మారనుందంటున్నారు పరిశీలకులు. పార్టీలు ఖర్చు పెట్టేది ఎంతో అంచనా వేయడం కూడా కష్టమే అంటున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు, పథకాల కోసం దాదాపు మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఒక అంచనా!!
తాజావార్తలు
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..