ఒకవైపు కరోనా..మరోవైపు జాతరల సీజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సీజన్ మొదలైంది. ఇంటి ఇలవేల్పులకు మొక్క చెల్లించేందుకు పెద్దఎత్తున భక్తులు జాతరలకు వెళ్తుంటారు. కరోనా పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ జాతరల్లో ముందు జాగ్రత్తల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
జనవరి మాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లాలో జాతర సీజన్ మొదలవుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కొత్తకొండ, కొమురవెల్లి, మేడారం జాతరలు జరుగుతాయి. సంక్రాంతి నుంచి మొదలయ్యే జాతరలతో ఉమ్మడి వరంగల్ జిల్లావాసులే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. సంక్రాంతి కాగానే ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరకు సుమారు 10లక్షలమంది భక్తులు వస్తారు.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఇక కొమురవెల్లి మల్లన్న జాతర ఇంతకంటే ఘనంగా జరుగుతుంది. కొమురవెల్లి జాతర కూడా సంక్రాంతి నుంచే మొదలవుతుంది. మూడు నెలలకుపైగా సుదీర్ఘంగా జరిగే ఈ జాతరకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. . రాష్ట్రమంతటినుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి మల్లన్లకు మొక్కులు చెల్లించుకుంటారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం కూడా జాతరకు సిద్ధమైంది. జనవరి 10న కల్యాణోత్సవంతో ప్రారంభమయ్యే జాతర 18వ తేదీ అగ్నిగుండాల వరకు సాగుతుంది.
ఎనిమిది రోజులపాటు జరిగే ఈ జాతరలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ముఖ్యమైన మూడు తేదీల్లో లక్షల్లో ప్రజలు పోటెత్తుతారు. వీరభద్రుడికి కోరమీసాలు, కోడెమొక్కులు చెల్లించుకుంటారు. గీసుకొండ మండలం కొమ్మాల జాతర హోలీ నుంచి ప్రారంభమై 15 రోజులు జరుగుతుంది. జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో కూడా అనేక ఆలయాలు, క్షేత్రాల్లో సంక్రాంతి నుంచి శివరాత్రి మధ్య అనేక జాతరలు జరుగుతాయి. జాతరల సమయంలో కరోనా కేసులు పెరగడం అందరినీ భయపెడుతుంది. ఒమిక్రాన్ కేసులు పెరిగి ఎలాంటి ముప్పు తెస్తుందో అన్నా భయం అధికార యంత్రాంగంలో మొదలైంది.
లక్షల సంఖ్యలో భక్తజనం వచ్చి తమ ఇష్టదైవాలను కొలిచే సమయం కాబట్టి ఈసారి జాతరల్లో అనేక జాగ్రత్తలు అవసరం. కొవిడ్ విజృంభిస్తున్నందున జాతరల నిర్వహణ ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది. వేలాదిగా ప్రజలు గుమికూడే ఇలాంటి జాతరల్లో మాస్క్ పెట్టుకునేలా చేయడం, ముఖ్యంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయించడం వీలు కాని పని. దీంతో రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే జాతర విధుల్లో ఉండే పోలీసులకు పలు సూచనలు చేశారు ఉన్నతాధికారులు. భక్తుల భద్రతతో పాటు… ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆర్జిత సేవలను రద్దు చేసిన దేవాదాయ శాఖ అధికారులు కేవలం దర్శనానికి మంత్రమే అనుమతి ఇస్తున్నారు. మరోవైపు ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!