ఏపీసీసీ చీఫ్ మార్పుపై హైకమాండ్ తర్జనభర్జన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ కాంగ్రెస్ కి జవసత్వాలు ఇచ్చి ముందుకు నడిపించే సారథి కోసం హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఏపీసీసీ చీఫ్ మార్పుపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పుపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ. ఏపీసీసీ చీఫ్ పదవికి రేసులో ఐదుగురు నేతలు వున్నారని తెలుస్తోంది.
ఏపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ హర్షకుమార్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలీ వున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో రెండు రోజుల పర్యటనలో విడివిడిగా భేటీ అయిన కాంగ్రెస్ వ్యవహరాల ఏపీ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ ఈమేరకు ఒక నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీలకు ఇచ్చారు కాబట్టి.. ఈ దఫా ఓసీలకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టాలని పలువురు నేతలు చాందీకి సూచించారని తెలుస్తోంది.
Also Read
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
- Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
తనకు మరోసారి అవకాశమిస్తే కొనసాగేందుకు సిద్దమన్నారు ప్రస్తుత పీసీసీ చీఫ్ సాకె శైలజానాధ్. కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డిలతో సంప్రదించాకే పీసీసీ చీఫ్ పదవిపై తుది నిర్ణయం తీసుకోవాలని మెజార్టీ కాంగ్రెస్ నేతల సూచించారు. ఇకపై కేవీపీ, కిరణ్, రఘువీరాలు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని నేతలతో చెప్పారు ఉమెన్ చాందీ.
2023 నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం వుండడంతో రెండేళ్ళలో పార్టీని గాడిన పెట్టేందుకు రాబోయే పీసీసీ సారథి ఏమేరకు సఫలీకృతుడు అవుతాడో చూడాలి. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు లేకుండా ముందుకు సాగుతోంది. ఏపీలోని రెండు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు. కనీసం స్థానిక ఎన్నికల్లోనూ ఉనికిని చాటుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమనే చెప్పాలి. కొత్త బాస్ కి పార్టీని ముందుకు నడిపించడం నల్లేరు మీద బండి నడక కాబోదనే చెప్పాలి. ఐదుగురు నేతల్లో ఎవరి వైపు అధిష్టానం మొగ్గుచూపుతుందో చూడాలి.
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?