ఏపీసీసీ చీఫ్ మార్పుపై హైకమాండ్ తర్జనభర్జన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ కాంగ్రెస్ కి జవసత్వాలు ఇచ్చి ముందుకు నడిపించే సారథి కోసం హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఏపీసీసీ చీఫ్ మార్పుపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పుపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ. ఏపీసీసీ చీఫ్ పదవికి రేసులో ఐదుగురు నేతలు వున్నారని తెలుస్తోంది.
ఏపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ హర్షకుమార్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలీ వున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో రెండు రోజుల పర్యటనలో విడివిడిగా భేటీ అయిన కాంగ్రెస్ వ్యవహరాల ఏపీ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ ఈమేరకు ఒక నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీలకు ఇచ్చారు కాబట్టి.. ఈ దఫా ఓసీలకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టాలని పలువురు నేతలు చాందీకి సూచించారని తెలుస్తోంది.
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- Greece: గ్రీస్లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
తనకు మరోసారి అవకాశమిస్తే కొనసాగేందుకు సిద్దమన్నారు ప్రస్తుత పీసీసీ చీఫ్ సాకె శైలజానాధ్. కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డిలతో సంప్రదించాకే పీసీసీ చీఫ్ పదవిపై తుది నిర్ణయం తీసుకోవాలని మెజార్టీ కాంగ్రెస్ నేతల సూచించారు. ఇకపై కేవీపీ, కిరణ్, రఘువీరాలు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని నేతలతో చెప్పారు ఉమెన్ చాందీ.
2023 నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం వుండడంతో రెండేళ్ళలో పార్టీని గాడిన పెట్టేందుకు రాబోయే పీసీసీ సారథి ఏమేరకు సఫలీకృతుడు అవుతాడో చూడాలి. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు లేకుండా ముందుకు సాగుతోంది. ఏపీలోని రెండు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు. కనీసం స్థానిక ఎన్నికల్లోనూ ఉనికిని చాటుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమనే చెప్పాలి. కొత్త బాస్ కి పార్టీని ముందుకు నడిపించడం నల్లేరు మీద బండి నడక కాబోదనే చెప్పాలి. ఐదుగురు నేతల్లో ఎవరి వైపు అధిష్టానం మొగ్గుచూపుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
-
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!