Hyderabad: కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ పీఎస్లో చిన్నారుల ఫిర్యాదు..
- కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ పేట్ బషీరాబాద్ పీఎస్లో చిన్నారుల ఫిర్యాదు
- రేవంత్ అంకుల్ 'మా ప్రాణాలకు భరోసా ఏది' అంటూ ప్రకార్డులతో నిరసన
- NCL కాలనీలో గత రెండు రోజులలో ముగ్గురు పిల్లలు.. ఒక పెద్దాయనపై వీధి కుక్కలు దాడి
- కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.
వీధి కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ.. కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది చిన్నారులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. వారంతా.. కుత్బుల్లాపూర్లోని పలు కాలనీలకు సంబంధించిన చిన్నారులు కాగా.. రేవంత్ అంకుల్ ‘మా ప్రాణాలకు భరోసా ఏది’ అంటూ ప్రకార్డులతో నిరసన తెలిపారు. జంట నగరాలలో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది. చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచి మరణానికి కారణమవుతున్నాయి.. చిన్నారులను బయటికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొంపల్లి మున్సిపాలిటీ NCL కాలనీలో గత రెండు రోజులలో ముగ్గురు పిల్లల్ని, ఒక పెద్దాయనని వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా.. మున్సిపల్ అధికారులలో చలనం లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ విషయమై పోరాడుతూనే ఉన్నా.. ఎన్సీఎల్ కాలనీలో మార్పులు జరిగాయి తప్ప ప్రయోజనం లేదు. పిల్లల్ని వీధి కుక్కలు పీక్కొని తినే పరిస్థితి వస్తుంది అని కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
Junnu: అయ్యా బాబోయ్.. ‘జున్ను’ తింటే జరిగేది ఇదా..
Also Read
బయట జరిగిన సంఘటన మన దగ్గర జరగదని అనుకోకూడదు. పిల్లలు ఎవరైనా పిల్లలే.. మన కళ్ళ ముందు మరొక సంఘటన జరగకముందే మేల్కొందాం అని భావించి బాధ్యత గల తల్లిదండ్రులుగా ఈ కార్యక్రమం తమ ఒక్కరి కోసం కాదు అందరికోసం.. వీధి కుక్కల నుండి కాపాడండి అంటూ తల్లిదండ్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ అంటూ చిన్నారులు ప్లేకార్డులు చేతబూని స్టేషన్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. సంబంధిత అధికారులను సంప్రదించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
AP Assembly: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలి రోజు గవర్నర్ ప్రసంగం
మరోవైపు.. రాష్ట్రంలో కూడా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత బుధవారం హుజురాబాద్లో దాదాపు 29 మందిపై దాడిచేసి కరిచాయి. వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. హుజురాబాద్ అనే కాదు హైదరబాద్ సహా అనేక ప్రదేశాలలో కుక్కలు విరుచుకుపడుతున్నాయి. ఇటీవల ఘట్కేసర్ ప్రాంతంలో కూడా ఓ కుక్క 14 ఏళ్ల బాలుడిని వెంటాడింది. సంగారెడ్డిలో కూడా ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇదిలా ఉంటే.. వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు.. పరిష్కార మార్గాలను హైకోర్టు అన్వేషించాలని సూచింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!