Hyderabad: కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ పీఎస్లో చిన్నారుల ఫిర్యాదు..
- కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ పేట్ బషీరాబాద్ పీఎస్లో చిన్నారుల ఫిర్యాదు
- రేవంత్ అంకుల్ 'మా ప్రాణాలకు భరోసా ఏది' అంటూ ప్రకార్డులతో నిరసన
- NCL కాలనీలో గత రెండు రోజులలో ముగ్గురు పిల్లలు.. ఒక పెద్దాయనపై వీధి కుక్కలు దాడి
- కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీధి కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ.. కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది చిన్నారులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. వారంతా.. కుత్బుల్లాపూర్లోని పలు కాలనీలకు సంబంధించిన చిన్నారులు కాగా.. రేవంత్ అంకుల్ ‘మా ప్రాణాలకు భరోసా ఏది’ అంటూ ప్రకార్డులతో నిరసన తెలిపారు. జంట నగరాలలో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది. చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచి మరణానికి కారణమవుతున్నాయి.. చిన్నారులను బయటికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొంపల్లి మున్సిపాలిటీ NCL కాలనీలో గత రెండు రోజులలో ముగ్గురు పిల్లల్ని, ఒక పెద్దాయనని వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా.. మున్సిపల్ అధికారులలో చలనం లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ విషయమై పోరాడుతూనే ఉన్నా.. ఎన్సీఎల్ కాలనీలో మార్పులు జరిగాయి తప్ప ప్రయోజనం లేదు. పిల్లల్ని వీధి కుక్కలు పీక్కొని తినే పరిస్థితి వస్తుంది అని కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
Junnu: అయ్యా బాబోయ్.. ‘జున్ను’ తింటే జరిగేది ఇదా..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
బయట జరిగిన సంఘటన మన దగ్గర జరగదని అనుకోకూడదు. పిల్లలు ఎవరైనా పిల్లలే.. మన కళ్ళ ముందు మరొక సంఘటన జరగకముందే మేల్కొందాం అని భావించి బాధ్యత గల తల్లిదండ్రులుగా ఈ కార్యక్రమం తమ ఒక్కరి కోసం కాదు అందరికోసం.. వీధి కుక్కల నుండి కాపాడండి అంటూ తల్లిదండ్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ అంటూ చిన్నారులు ప్లేకార్డులు చేతబూని స్టేషన్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. సంబంధిత అధికారులను సంప్రదించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
AP Assembly: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలి రోజు గవర్నర్ ప్రసంగం
మరోవైపు.. రాష్ట్రంలో కూడా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత బుధవారం హుజురాబాద్లో దాదాపు 29 మందిపై దాడిచేసి కరిచాయి. వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. హుజురాబాద్ అనే కాదు హైదరబాద్ సహా అనేక ప్రదేశాలలో కుక్కలు విరుచుకుపడుతున్నాయి. ఇటీవల ఘట్కేసర్ ప్రాంతంలో కూడా ఓ కుక్క 14 ఏళ్ల బాలుడిని వెంటాడింది. సంగారెడ్డిలో కూడా ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇదిలా ఉంటే.. వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు.. పరిష్కార మార్గాలను హైకోర్టు అన్వేషించాలని సూచింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..