Co-working: కలిసి పనిచేద్దాం రా. కో-వర్కింగ్కి జై అంటున్న ఉద్యోగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Co-working: కరోనా మహమ్మారి నేపథ్యంలో కో-వర్కింగ్ కల్చర్ ఇక కనుమరుగైనట్లే అని అందరూ అనుకున్నారు. కానీ ఆ అంచనా తప్పు అని రుజువైంది. కలిసి పనిచేద్దాం రా అంటూ ఉద్యోగులు కో-వర్కింగ్కి జై కొడుతున్నారు. ఏక్ నిరంజన్లా ఒంటరిగా కూర్చొని చేసే వర్క్ ఫ్రం హోంతో తెగ బోర్ కొట్టి క్రమంగా కార్యాలయాల బాట పడుతున్నారు. దీంతో ఆఫీసుల్లో కొవిడ్ ముందు నాటి పరిస్థితులు దాదాపు పూర్తి స్థాయిలో నెలకొన్నాయి. ఫలితంగా దేశం మొత్తమ్మీద కో-వర్కింగ్ స్పేస్లకు గిరాకీ పెరిగింది.
ఆఫీసుల్లో హైబ్రిడ్ మోడల్ పని వాతావరణాన్ని ప్రారంభించాలనుకునేవారికి ఇదొక బెస్ట్ ఆప్షన్లా నిలవబోతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్గా ఓ రీసెర్చ్ రిజల్ట్స్ వెలువడ్డాయి. దాని ప్రకారం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయాల విస్తీర్ణం 34.1 మిలియన్ చదరపు అడుగులు. ఇందులో 13 శాతం వాటా(దాదాపు 4.43 మిలియన్ స్క్వేర్ ఫీట్)ను కో-వర్కింగ్ స్పేస్లు ఆక్రమించాయి. 2020-21లో ఇది కేవలం 5 శాతమే కావటం గమనార్హం.
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
అంటే ఏకంగా 8 శాతం వృద్ధిరేటు నమోదైందని చెప్పొచ్చు. ఇది అన్ని ఆఫీస్ సెగ్మంట్లలో అత్యధికం కావటం విశేషం. దీని తర్వాత సుమారు 4 శాతం వృద్ధిరేటుతో మ్యానిఫ్యాక్షనింగ్/ఇండస్ట్రియల్ సెక్టర్ నిలిచింది. ఇదే సమయంలో ఐటీ/ఐటీ అనుబంధ రంగాలు, ఇ-కామర్స్ రంగాల వృద్ధిరేటు వరుసగా 8 శాతం, 6 శాతం పడిపోయాయి. వ్యాపారాలు/ఉద్యోగుల కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే సౌకర్యాల వైపు (ఫ్లెక్సిబుల్ స్పేసెస్ దిశగా) పని వాతావరణం క్రమంగా మారుతోందనటానికి ఇదో నిదర్శమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తం కో-వర్కింగ్ స్పేస్లో దగ్గరదగ్గరగా 50 శాతం స్పేస్ 0.1 మిలియన్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగినవే. మిడ్ సైజ్ ఆఫీస్లు కూడా 1 శాతం వృద్ధిని నమోదుచేశాయి. మొత్తం ఆఫీసు స్పేస్లో 58 శాతం వాటాను దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆక్రమించాయి. ఈ నగరాల్లో వర్క్ స్పేస్ ఆఫీసుల యావరేజ్ రెంట్ (ఒక నెలకి) ఒక చదరపు అడుగుకి 76 రూపాయలుగా ఉంది.
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?