NTV Telugu Site icon

తిరుప‌తిలో బిజీబిజీగా సీఎం జ‌గ‌న్‌…

తిరుప‌తిలో సీఎం జ‌గ‌న్ రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తున్నారు.  ఈరోజు మ‌ధ్యాహ్నం గ‌న్న‌వ‌రం నుంచి తిరుప‌తికి చేరుకున్నారు.  అనంత‌రం సీఎం జ‌గ‌న్ బ‌ర్డ్‌లో  శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌ పిల్ల‌ల కార్డియాక్ ఆసుప‌త్రిని ప్రారంభించారు.  ఆ త‌రువాత అలిపిరి వ‌ద్ధ శ్రీవారి పాదాల వ‌ద్ద నుంచి న‌డ‌క మార్గంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన పైక‌ప్పును,  గో మందిరాన్ని ప్రారంభించారు.  ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్సవాలు జ‌రుగుతున్నాయి.  ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో సీఎం జ‌గ‌న్ పాల్గొన‌బోతున్నారు.  తిరుమ‌ల‌కు చేరుకున్న త‌రువాత సీఎం బేడి ఆంజ‌నేయ స్వామివారిని ద‌ర్శించుకుంటారు.  ఆ త‌రువాత రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున స్వామి వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించనున్నారు.  శ్రీవారిని ద‌ర్శనం చేసుకున్న అనంత‌రం సీఎం జ‌గ‌న్ ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌కు వెళ్లి రాత్రి అక్క‌డే బ‌స చేయ‌నున్నారు.  

Read: విద్యుత్ వినియోగంపై స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు…