MP K.Laxman: ప్రధానిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఆగ్రహం
- ప్రధాని మోడీని మహ్మద్ గజనీతో పోల్చుతూ సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు
- సీఎం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందూ ధార్మికతను అవమానించేలా ఉన్నాయి- లక్ష్మణ్
- రేవంత్ రెడ్డి మాటలు దిగజరారిన రాజకీయాలకు, చౌకబారు మాటలకు నిదర్శనం- లక్ష్మణ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీని మహ్మద్ గజనీతో పోల్చతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందూ ధార్మికతను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటలు దిగజరారిన రాజకీయాలకు, చౌకబారు మాటలకు నిదర్శనం అని దుయ్యబట్టారు. మహ్మద్ గజనీ దేశాన్ని దోచుకున్నాడు.. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి మన సాంస్కృతిక వారసత్వాన్ని మట్టిలో కలిపాడన్నారు. అలాంటి దోపిడీదారుడితో ప్రధాని మోడీని పోల్చడం రేవంత్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు.
Read Also: Delhi: ఎయిర్పోర్టులో రూ.10 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. కేటుగాడు ఎక్కడ దాచాడంటే..!
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
మోడీ నాయకత్వంలో భారతదేశం తన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని తిరిగి చాటుకుంటోందని తెలిపారు. సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ కారిడార్, అయోధ్య రామమందిరం వంటి ఆలయాలను పునర్నిర్మించి హిందువుల మనోభావాలను గౌరవించేలా మోడీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించి, హిందూ దేవాలయాల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతోందని అన్నారు. మహ్మద్ గజినీ మన దేశంపై దాడి చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడని.. ప్రధాని మోడీ ధ్వంసమైన దేవాలయాలను పునరుద్ధరించి, హిందూ ధార్మికతను, గౌరవాన్ని పెంచారని లక్ష్మణ్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అనే హోదాను కూడా మర్చిపోయి దిగజారుడు మాటలు మాట్లాడటం సిగ్గుచేటని ఆరోపించారు. దేశాభివృద్ధి కోసం విశ్వమానవతా స్ఫూర్తితో పనిచేస్తున్న ప్రధాని మోడీని మహ్మద్ గజినీతో పోల్చడం.. భారతీయ సంస్కృతిని అవమానించడం లాంటిదేనని లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: CPM: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ..
గాంధీజీ పిలుపునిచ్చిన స్వదేశీ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా విస్మరించిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ మహాత్మా గాంధీ శాంతి, అహింస సిద్ధాంతాలను పాటిస్తూ.. దేశాభివృద్ధి కోసం పాటుపడుతోందని తెలిపారు. కానీ కాంగ్రెస్ మహాత్మా గాంధీ పేరును రాజకీయం కోసం వాడుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ భావజాలానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించిందని చెప్పారు. అహింస సిద్ధాంతానికి విరుద్ధంగా 1975లో ఎమర్జెన్సీని విధించి, ప్రజల స్వేచ్ఛను తుంగలో తొక్కిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం కాదు, తన స్వంత ప్రయోజనాల కోసం 90 సార్లు రాజ్యాంగాన్ని మార్చిందని లక్ష్మణ్ తెలిపారు. గాంధీ అహింస సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా నక్సల్స్ మద్దతుదారులను ప్రోత్సహించడం.. తెలంగాణలో మావోయిస్టులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ తీరును బహిర్గతం చేస్తోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
-
Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
-
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?