కొండపల్లి చైర్మన్ ఎన్ని వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా విధ్వంసం సృష్టించి వాయిదా వేయించడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు. ఎన్నిక నిర్వహణ రాకపోతే ఎస్ఈసీ, డీజీపీలు తప్పుకోవాలని ధ్వజమెత్తారు. ఎన్నిక అడ్డుకోవడమెందుకు.. వైకాపా వారినే చైర్మన్ చేయండి అంటూ మండి పడ్డారు.
టీడీపీ సభ్యులను లోబర్చకోని కొండపల్లిలో పాగా వేయాలని చూస్తున్నారన్నారు. కౌన్సిల్ కార్యాలయంలోకి సంబంధం లేని వ్యక్తులు వచ్చి హల్చల్ చేస్తున్నారన్నారు. ఇంత జరుతుగున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ సభ్యుల ఓర్పును చేతగానితనంగా చూడొద్దని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి అంటూ హితవు పలికారు.