గత శుక్రవారం… మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు అంటే… (నవంబర్ 29న) “మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు”ను లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సభా కార్యకలాపాల జాబితా సిధ్దం చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు… కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడమే కాకుండా… పార్లమెంట్ రద్దు బిల్లును పెట్టాలని రైతులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ లెక్కన నవంబర్ 29 న మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు”ను లోక్సభలో ప్రవేశ పెట్టనుంది.