ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్ రణంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సీతారామశాస్త్రి మరణం రాష్ట్ర ప్రజలకు, సినీ పరిశ్రమకు తీరని లోటు. సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.దాదాపు 3 వేల పాటలు రచించిన సీతారామశాస్త్రి ఉత్తమ పాటల రచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించిన గొప్ప రచయిత. తెల్లారింది లెగండోయ్…. నిగ్గదీసి అడుగు…ఇంటి పేరు కాదుర గాంధీ, ఆదిభిక్షువు వాడిని ఏది అడిగేది, తరలిరాద తనే వసంతం…ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లు… అంటూ ఆయన రాసిన ఎన్నో పాటలు ప్రజల మనుసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
సీతారామశాస్త్రి రాసిన ప్రతి పాట ప్రజల మనసును దోచుకునేలా ఉండటం విశేషం. సీతారామశాస్త్రి మన మధ్య భౌతికంగా లేకపోయినా పాటల రూపంలో చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు బండి సంజయ్.
తెలుగు సామ్రాజ్యం ఒక గొప్ప కవిని కోల్పోయిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు విచారం వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనను తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది . వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు విద్యాసాగర్ రావు. ఆ భగవంతుడు కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసింది. నాకు ఎంతో ఆత్మీయులు. సిరివెన్నెల సినిమా తన ఇంటి పేరుగా మార్చింది. సిరివెన్నెల లోని పాటలు తెలుగు సినిమా చరిత్రలో తెలుగు ప్రజలకు గుర్తుండిపోయే పాటలు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన గేయాల ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి గొప్పతనాన్ని చాటిచెప్పిన వ్యక్తి. 1997లో బిజెపి జాతీయ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వారికి జాతీయస్థాయిలో యువ మోర్చా ఆధ్వర్యంలో యువ కళాకారుడిగా అవార్డును అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీదుగా అందించడం జరిగింది. వారితో అనేక సందర్భాల్లో వివిధ అంశాలపై చర్చించడం జరిగింది.
భారతమాత మహా హారతి కార్యక్రమం లో వారు పాల్గొనడం దేశ ఔన్నత్యాన్ని గురించి ప్రజలకు వివరిస్తున్నప్పుడు ప్రజలు ఎంతో శ్రద్ధగా విన్నారు. వారి పాటల ద్వారా తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలను వివరించడంతో పాటు దేశభక్తిని,దైవ భక్తి ని ,ప్రబోధించడం ద్వారా ఒక మంచి వ్యక్తులుగా ప్రధానంగా యువత క్రమశిక్షణ కలిగి మంచి పౌరులుగా నడిచే విధంగా ఉండేది. సినీరంగంలో అనేక అవార్డులను, నంది అవార్డులను, పద్మశ్రీ పొందిన వ్యక్తి.ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు వారి అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అన్నారు కిషన్ రెడ్డి.