ఈటల రాజకీయ ప్రస్థానం.. అపజయం ఎరుగని నేత.. ఏడు విజయాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా విజయాలు సాధించిన ఈటల.. ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగి మరోసారి గెలుపొందారు. రాజేందర్ 2021 జూన్లో టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వడంతో హుజూరాబాద్లో ఉప ఎన్నికలు అనివార్యం అయిన సంగతి తెలిసిందే.. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. అయితే, వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఆయన.. ఎవరిపై సాధించారు.. ఎంత మెజార్టీ దక్కిందనేది ఓసారి పరిశీలిద్దాం..
2004లో తొలిసారిగా కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈటల.. ఆయనకు 68,393 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డికి 48,774 ఓట్లు వచ్చాయి.. దీంతో.. ఈటలకు 19,619 ఓట్ల మెజార్టీ దక్కింది. ఇక, 2008లో మరోసారి కమలాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయనకు 54,092 ఓట్లు వచ్చాయి.. ఈ సారి ముద్దసాని దామోదర్ రెడ్డికి 31,808 ఓట్లు రావడంతో.. ఈటల మెజార్టీ 22,284కి పెరిగింది. ఇక, తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసిన ఈటల.. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 2009లో ఉప ఎన్నికల్లో పోటీచేయగా 56,752 ఓట్లు వచ్చాయి.. ఆయనపై పోటీచేసిన కృష్ణమోహన్ వకులాభరణంకు 41,717 ఓట్లు పోల్ అయ్యాయి.. అప్పుడు 15,035 ఓట్ల మెజార్టీ దక్కింది.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఇక, 2010 ఉప ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగిన ఈటల రాజేందర్కు 93,026 ఓట్లు రాగా.. ముద్దసానికి 13,799 ఓట్లు మాత్రమే వచ్చాయి.. ఈ ఎన్నికల్లో 79,227 ఓట్ల భారీ మెజార్టీతో విజయం ఢంకా మోగించారు ఈటల.. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 95,315 ఓట్లు సాధించారు.. ఆయన సమీప ప్రత్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డికి 38278 ఓట్లు రాగా.. ఈటలకు 57,037 ఓట్ల మెజార్టీ దక్కింది. మరోవైపు.. 2018 ఎన్నికల్లో ఈటలకు 1,04,840 ఓట్లు వచ్చాయి.. కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు సాధించారు.. ఈ సారి ఈటల మెజార్టీ 43,719గా ఉంది. ఇక, ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సారి జరిగిన ఉప ఎన్నికల్లో.. ఈటెల రాజేందర్కు 1,06,213 ఓట్లు పోలయ్యాయి.. అధికార పార్టీకి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 82,348 ఓట్లు రాగా.. ఈటల 23,855 ఓట్ల మెజార్టీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా.. వరుసగా ఏడుసార్లు విజయం సాధిస్తూ వస్తున్నారు ఈటల.. పార్టీ మారినా.. తనపై ప్రజల్లో అభిమానం మాత్రం తగ్గలేదని ఈ ఎన్నికలతో రుజువు చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!