Flight Charges Hike: చుక్కలు చూపిస్తున్న డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జెస్.. ముంబై- శ్రీనగర్ రూట్లో రూ. 92 వేలు
- చుక్కలు చూపిస్తున్న డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జెస్..
- ఇండిగో సంక్షోభంతో ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు..
- సంక్షోభాన్ని సొమ్ము చేసుకుంటున్న పలు ఎయిర్ లైన్స్..
- ఒక్కసారిగా పెరిగిన స్పైస్ జెట్, ఎయిరిండియా టికెట్ రేట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flight Charges Hike: దేశీయ విమాన ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. ఇండిగో ఎయిర్లైన్స్లో ఏర్పడ్డ సంక్షోభం కారణంగా వందలాది విమానాలు రద్దు కావడంతో డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జెస్ అమాంతం పెరిగిపోయాయి. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటూ స్పైస్జెట్, ఎయిరిండియా వంటి ఎయిర్లైన్స్ తమ టికెట్ రేట్లను ఒక్కసారిగా పెంచేశాయి. ఢిల్లీ- ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ సాధారణంగా రూ. 20 వేలు ఉండేది.. కానీ, ఇప్పుడు ఏకంగా రూ. 60 వేలు దాటింది. అలాగే, ముంబై- శ్రీనగర్ మార్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాధారణ రోజుల్లో: రూ. 10 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ. 62 వేలకు టికెట్ ధరలను పెంచినట్లు ప్రకటించాయి. ఇక, అదే రూట్లో ముంబై- శ్రీనగర్ రౌండ్ ట్రిప్ టికెట్ ధర రూ. 92 వేలకు చేరింది.
Read Also: CM Revanth Reddy: నర్సంపేటపై వరాల జల్లు.. రూ.532.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
అయితే, స్పైస్జెట్, ఎయిరిండియా ఎయిర్లైన్స్ తమ టికెట్ రేట్ల పెంపకంతో ప్రయాణికులను షాక్కు గురి చేస్తోంది. ప్రస్తుతం డొమెస్టిక్ ధరలతో పోలిస్తే ఢిల్లీ- న్యూయార్క్ కనిష్ట టికెట్ ధర కేవలం రూ. 36,600 మాత్రమే ఉంది. ఇక, ఢిల్లీ- ముంబై టికెట్ ధర రూ. 40,450గా ఉంది. అంటే అంతర్జాతీయ ప్రయాణం కంటే దేశీయ ప్రయాణమే ఇప్పుడు మరింత ఖరీదు అవుతోంది.
Read Also: iBomma Ravi: మూడు కేసుల్లో ఐబొమ్మ రవి కస్టడీకి అనుమతి
అలాగే, ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చే టికెట్ ధర రూ. 40 వేల పైగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాధారణంగా డొమెస్టిక్ టికెట్లు రూ. 6 వేల నుంచి 10 వేల మధ్య టికెట్ లభించే పరిస్థితి ఉండేది కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండిగో నిర్వహణ లోపాలతో వందలాది విమానాలు రద్దు కావడంతో, అత్యవసరంగా ప్రయాణించాల్సిన వేలాది మందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హఠాత్తుగా పెరిగిన ధరల వల్ల ప్యాసింజర్ల జేబులు ఖాళీ అవుతున్నాయి. అత్యవసర ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నవారు అధిక ధరలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!