Flight Charges Hike: చుక్కలు చూపిస్తున్న డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జెస్.. ముంబై- శ్రీనగర్ రూట్లో రూ. 92 వేలు
- చుక్కలు చూపిస్తున్న డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జెస్..
- ఇండిగో సంక్షోభంతో ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు..
- సంక్షోభాన్ని సొమ్ము చేసుకుంటున్న పలు ఎయిర్ లైన్స్..
- ఒక్కసారిగా పెరిగిన స్పైస్ జెట్, ఎయిరిండియా టికెట్ రేట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flight Charges Hike: దేశీయ విమాన ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. ఇండిగో ఎయిర్లైన్స్లో ఏర్పడ్డ సంక్షోభం కారణంగా వందలాది విమానాలు రద్దు కావడంతో డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జెస్ అమాంతం పెరిగిపోయాయి. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటూ స్పైస్జెట్, ఎయిరిండియా వంటి ఎయిర్లైన్స్ తమ టికెట్ రేట్లను ఒక్కసారిగా పెంచేశాయి. ఢిల్లీ- ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ సాధారణంగా రూ. 20 వేలు ఉండేది.. కానీ, ఇప్పుడు ఏకంగా రూ. 60 వేలు దాటింది. అలాగే, ముంబై- శ్రీనగర్ మార్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాధారణ రోజుల్లో: రూ. 10 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ. 62 వేలకు టికెట్ ధరలను పెంచినట్లు ప్రకటించాయి. ఇక, అదే రూట్లో ముంబై- శ్రీనగర్ రౌండ్ ట్రిప్ టికెట్ ధర రూ. 92 వేలకు చేరింది.
Read Also: CM Revanth Reddy: నర్సంపేటపై వరాల జల్లు.. రూ.532.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Also Read
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
అయితే, స్పైస్జెట్, ఎయిరిండియా ఎయిర్లైన్స్ తమ టికెట్ రేట్ల పెంపకంతో ప్రయాణికులను షాక్కు గురి చేస్తోంది. ప్రస్తుతం డొమెస్టిక్ ధరలతో పోలిస్తే ఢిల్లీ- న్యూయార్క్ కనిష్ట టికెట్ ధర కేవలం రూ. 36,600 మాత్రమే ఉంది. ఇక, ఢిల్లీ- ముంబై టికెట్ ధర రూ. 40,450గా ఉంది. అంటే అంతర్జాతీయ ప్రయాణం కంటే దేశీయ ప్రయాణమే ఇప్పుడు మరింత ఖరీదు అవుతోంది.
Read Also: iBomma Ravi: మూడు కేసుల్లో ఐబొమ్మ రవి కస్టడీకి అనుమతి
అలాగే, ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చే టికెట్ ధర రూ. 40 వేల పైగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాధారణంగా డొమెస్టిక్ టికెట్లు రూ. 6 వేల నుంచి 10 వేల మధ్య టికెట్ లభించే పరిస్థితి ఉండేది కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండిగో నిర్వహణ లోపాలతో వందలాది విమానాలు రద్దు కావడంతో, అత్యవసరంగా ప్రయాణించాల్సిన వేలాది మందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హఠాత్తుగా పెరిగిన ధరల వల్ల ప్యాసింజర్ల జేబులు ఖాళీ అవుతున్నాయి. అత్యవసర ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నవారు అధిక ధరలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!