Site icon NTV Telugu

Saudi Arabia: ఘోర బస్సు ప్రమాదం… 20 మంది యాత్రికులు దుర్మరణం

Bus Accident

Bus Accident

సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. హజ్ యాత్రకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై 20 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ప్రయాణీకుల బస్సు వంతెనపై ఢీకొని, బోల్తా పడింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read:Young Man Died While Dancing In Wedding: ప్రాణాలు తీస్తోన్న డీజేలు.. పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ మరో యువకుడు మృతి

సౌదీ అరేబియాకు నైరుతిలో ఉన్న అసిర్ ప్రావిన్స్‌లోని 14 కిలోమీటర్ల పొడవైన అకాబత్ షార్ రహదారిపై సాయంత్రం 4 గంటలకు బస్సు ఖమీస్ ముషైత్ నుండి అభాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ రహదారి పర్వతాల గుండా వెళుతుంది మరియు 11 సొరంగాలు మరియు 32 వంతెనలను కలిగి ఉంది. బస్సు బ్రిడ్జిపైకి వెళుతున్నప్పుడు బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో వంతెన చివర ఉన్న అడ్డంకిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనం బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరో 29 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు ప్రమాదానికి గురికాగానే బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Exit mobile version