ఏపీలో ఉద్యోగసంఘాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దును వ్యతిరేకిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా సహకరించాలని కోరుతోంది ప్రభుత్వం. జీవోలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన బాటలో వెళతాం అంటున్నారు ఉద్యోగ సంఘాలు.
సీఎం క్యాంపు కార్యాలయానికి రానున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దు ను వ్యతిరేకిస్తున్న సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా సహకరించాలని కోరుతున్నా ఉద్యోగ సంఘాలు మాత్రం తాడోపేడో తేల్చుకుంటామంటున్నాయి.
ప్రస్తుతం అందుతున్న జీతాలు తగ్గకుండా ప్రొటెక్ట్ చేశాం అంటున్న ప్రభుత్వం మాటను ఉద్యోగులు వింటారా? రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిన తర్వాత కూడా సీసీఏ కింద అదనపు లబ్ది అవసరం లేదని సిఫార్సు చేసింది సీఎస్ కమిటీ. కేంద్ర వేతన సంఘం కూడా సీసీఏ రద్దుకు సిఫార్సు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఏం తేల్చబోతున్నారు. సీఎంఓ అధికారులతో సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జీవోలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన బాటలో వెళతాం అని సీఎంఓ అధికారులకు స్పష్టం చేయనున్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు. చివరాఖరిగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు భవిష్యత్ కార్యాచరణ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.