ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రూ.247 కోట్ల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ధి ప్రాజెక్ట్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ఆయన.. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్తో పాటు.. విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.. మొత్తంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు విశాఖలో ఆయన పర్యటన కొనసాగనుంది..
Read Also: డిసెంబర్ 17, శుక్రవారం రాశిఫలాలు…
ఇక, సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను పరిశీలిస్తే..
- సాయంత్రం 5 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్..
- సాయంత్రం 5.20 గంటలకు ఎన్ఏడీ జంక్షన్లోఎన్ఏడీ ఫ్లై ఓవర్తో పాటు వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన మరో 6 ప్రాజెక్ట్లను ప్రారంభిస్తారు సీఎం.
- సాయంత్రం 6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్కు హాజరుకానున్న సీఎం జగన్.
- సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్క్తో పాటు జీవీఎంసీ అభివృద్ధి చేసిన మరో 4 ప్రాజెక్ట్లను ప్రారంభించనున్న సీఎం.
- 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్కు హాజరుకానున్న సీఎం జగన్.
- రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరానికి సీఎం వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం.