ఏపీ, ఒడిశా సీఎంల భేటీ.. సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమావేశం ముగిసింది.. ఒడిశా సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ భేటీలో ముఖ్యంగా మూడు అంశాలపై చర్చించారు.. ఇక, రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కానుంది.. ఒడిశా అభ్యంతరాలతో సుదీర్ఘంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చ సాగగా.. సీఎం వైఎస్ జగన్తో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి పాల్గొన్నారు.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు గ్రామాలు, ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం ఎజెండాగా సాగింది.
ఆరు అంశాల పై పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు సీఎంలు.. కొఠియా గ్రామాల సమస్య, నేరడి బ్రిడ్జ్, జంఝావతి రిజర్వాయర్, పోలవరం, బహుదా నది ద్వారా నీటి విడుదల, బలిమెల,ఎగువ సీలేరు విద్యుత్ అంశాల పరిష్కారం కోసం కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. గంజాయి ఉత్పత్తి-రవాణా, వామపక్ష తీవ్రవాదాన్ని అడ్డుకోవటానికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. శ్రీకాకుళం జిల్లాలోని బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఒరిస్సా భాషకు, ఒరిస్సాలోని భరంపూర్ యూనివర్సిటీలో తెలుగు భాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు గ్రామాల్లోని పాఠశాలల్లో ఇరు భాషల బోధనకు ఉపాధ్యాయుల నియామకం, భాషా పుస్తకాల ముద్రణ, పరీక్షల ద్వారా ప్రజల్లో సోదర భావం పెంచే దిశగా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
Also Read
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
- Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
తాజావార్తలు
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!