ఫ్యాన్స్ రచ్చపై స్పందించిన ఐకాన్ స్టార్.. ఎప్పుడూ మర్చిపోను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది… అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను అని పేర్కొన్నారు.. కాగా, అల్లు అర్జున్తో ఫొటోలు దిగే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని వదులుకోకండి అంటూ… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారిపోవడంతో.. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తరలివచ్చారు.. క్యూలైన్లో అభిమాన హీరోకోసం వేచిచూశారు.. అయితే, ఫొటో సెషన్ లేదంటూ వచ్చిన సమాధానంతో అభిమానులు ఊగిపోయారు.. హీరో రావాల్సిందేనంటూ పట్టుబట్టారు.. ఇక, బన్నీ సాయంత్రం ఎన్-కన్వెన్షన్ సెంటర్ కు వస్తారని, ఫ్యాన్స్ మీట్, ఫొటో సెషన్ ఉంటుందంటూ వారికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుండగా.. దాంతో ఫ్యాన్స్ మొత్తం గీతా ఆర్ట్స్ నుంచి ఎన్-కన్వెన్షన్కు వెళ్లిపోయారు.. ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువగా ఉండడం.. అంచనాకు మించిన ఫ్యాన్స్ రావడంతో.. సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షలు విధించారు.. కానీ, అక్కడే తీపులాట మొదలైంది.. దీంతో.. కోపంతో ఓగిపోయిన ఫ్యాన్స్ కన్వెన్షన్ సెంటర్ గేటు విరగగొట్టడం.. బారికేడ్లను తొలగించడం.. అద్దాలు పగలగొట్టడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.. ఈ ఘటనలో కొంతమంది బన్నీ ఫ్యాన్స్ గాయపడ్డారు.
ఇక, పరిస్థితి చేయిదాటిపోవడంతో… ఎన్- కన్వెన్షన్ సెంటర్ దగ్గర కూడా ఫొటో సెషన్ రద్దు చేశారు.. ఫ్యాన్స్ మీట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ ఘటనపై రాత్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. ఫ్యాన్స్ మీట్లో నా అభిమానులకు గాయలు అయినట్టు తెలిసింది.. గాయపడిన అభిమానులను నా టీమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు.. అభిమానులకు సంబంధించిన ప్రతి సమాచారం నాకు తెలియజేస్తున్నారు.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను.. మీ ప్రేమ అభిమానం నాకు కోట్ల ఆస్తి.. దానిని ఎప్పుడు మర్చిపోను.. అంటూ ట్వీట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కాగా, బన్నీ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప ది రైజ్’… డిసెండర్ 17వ తేదీన విడుదలకానుంది.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.
Also Read
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
— Allu Arjun (@alluarjun) December 13, 2021
తాజావార్తలు
-
Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
-
Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
-
Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
-
Dollar vs UPI: డాలర్ ఆధిపత్యానికి బ్రేక్ వేయనున్న BRICS.. భారత్దే కీలక పాత్ర!
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!