ఫ్యాన్స్ రచ్చపై స్పందించిన ఐకాన్ స్టార్.. ఎప్పుడూ మర్చిపోను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది… అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను అని పేర్కొన్నారు.. కాగా, అల్లు అర్జున్తో ఫొటోలు దిగే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని వదులుకోకండి అంటూ… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారిపోవడంతో.. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తరలివచ్చారు.. క్యూలైన్లో అభిమాన హీరోకోసం వేచిచూశారు.. అయితే, ఫొటో సెషన్ లేదంటూ వచ్చిన సమాధానంతో అభిమానులు ఊగిపోయారు.. హీరో రావాల్సిందేనంటూ పట్టుబట్టారు.. ఇక, బన్నీ సాయంత్రం ఎన్-కన్వెన్షన్ సెంటర్ కు వస్తారని, ఫ్యాన్స్ మీట్, ఫొటో సెషన్ ఉంటుందంటూ వారికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుండగా.. దాంతో ఫ్యాన్స్ మొత్తం గీతా ఆర్ట్స్ నుంచి ఎన్-కన్వెన్షన్కు వెళ్లిపోయారు.. ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువగా ఉండడం.. అంచనాకు మించిన ఫ్యాన్స్ రావడంతో.. సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షలు విధించారు.. కానీ, అక్కడే తీపులాట మొదలైంది.. దీంతో.. కోపంతో ఓగిపోయిన ఫ్యాన్స్ కన్వెన్షన్ సెంటర్ గేటు విరగగొట్టడం.. బారికేడ్లను తొలగించడం.. అద్దాలు పగలగొట్టడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.. ఈ ఘటనలో కొంతమంది బన్నీ ఫ్యాన్స్ గాయపడ్డారు.
ఇక, పరిస్థితి చేయిదాటిపోవడంతో… ఎన్- కన్వెన్షన్ సెంటర్ దగ్గర కూడా ఫొటో సెషన్ రద్దు చేశారు.. ఫ్యాన్స్ మీట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ ఘటనపై రాత్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. ఫ్యాన్స్ మీట్లో నా అభిమానులకు గాయలు అయినట్టు తెలిసింది.. గాయపడిన అభిమానులను నా టీమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు.. అభిమానులకు సంబంధించిన ప్రతి సమాచారం నాకు తెలియజేస్తున్నారు.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను.. మీ ప్రేమ అభిమానం నాకు కోట్ల ఆస్తి.. దానిని ఎప్పుడు మర్చిపోను.. అంటూ ట్వీట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కాగా, బన్నీ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప ది రైజ్’… డిసెండర్ 17వ తేదీన విడుదలకానుంది.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.
Also Read
- Defence: రక్షణ శాఖ మరింత బలోపేతం.. అత్యాధునిక ఆయుధాలు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
- ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్గా విక్రయం
- Gold Scheme: బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!.. కొత్త స్కీమ్ ప్రకటనకు రంగం సిద్ధం!
- RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
— Allu Arjun (@alluarjun) December 13, 2021
తాజావార్తలు
-
Ketan Agarwal Murder Case: సియా, చేతన్ల ఫోన్లలో కోడ్ వర్డ్స్..
-
Defence: రక్షణ శాఖ మరింత బలోపేతం.. అత్యాధునిక ఆయుధాలు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
-
ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్గా విక్రయం
-
Dhruv Rathee: రాముడు-సీతలపై వ్యాఖ్యలు.. ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపుపై హైకోర్టు డెడ్లైన్
-
Bhatti Vikramarka : దమ్ముంటే చర్చకు రండి.. కేసీఆర్ కు భట్టి ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!