షర్మిల పాదయాత్రకు సర్వం సిద్ధం..!
పాదయాత్ర అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. ఆయన కంటే ముందు.. ఆ తర్వాత ఎంతోమంది పాదయాత్రలు చేశారు. అయినా పాదయాత్రలకు మాత్రం ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలోకి రావడానికి వైఎస్ అనుసరించిన ఈ ఫార్మూలా ఆ తర్వాత ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచింది. వైఎస్ఆర్ స్ఫూర్తితో పాదయాత్ర చేపట్టిన ఎంతోమంది రాజకీయ నాయకులు ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఏపీలో పాదయాత్ర చేపట్టారు. ఓదార్పు యాత్ర, పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లి జననేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల కష్టాసుఖాలను తెలుసుకొని వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను తయారు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించడంతో ప్రస్తుతం ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గడిచిన రెండేళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో సంక్షేమమే ప్రధాన ఏజెండా ముందుకు వెళుతున్నారు.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ఇక వైఎస్ఆర్ కూతురు షర్మిల సైతం తెలంగాణలో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా ఆమె వైఎస్ఆర్టీపీని స్థాపించారు. వైఎస్ఆర్ మాదిరిగానే ఆమె సైతం తెలంగాణలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రను చేవేళ్ల నుంచి ప్రారంభించగా షర్మిలా సైతం అదే జిల్లా నుంచి పాదయాత్రను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
షర్మిలకు పాదయాత్ర కొత్తేమీ కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అందుబాటులో లేని సమయంలో ఆమె ఆపార్టీ కోసం పాదయాత్ర చేపట్టారు. జగన్ వదిలిన బాణం అంటూ ఏకంగా 3,112 కిలోమీటర్ల పాదయాత్రను ఏపీలో పూర్తి చేశారు. అత్యధిక దూరం పాదయాత్ర చేపట్టిన తొలి మహిళగా ఆమె పేరు రికార్డుకెక్కింది. అయితే తన రికార్డును తానే బద్దలు చేసేలా తెలంగాణలో 4వేల పాదయాత్రను షర్మిల చేయబోతున్నారు. జీహెచ్ఎంసీ మినహా తెలంగాణలోని 90నియోజకవర్గాల పరిధిలో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.
ఈ పాదయాత్రను షర్మిల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు ఆపార్టీ మొత్తంగా 26 కమిటీలను ఏర్పాటు చేసింది. నియోజకవర్గాల వారీగా బాధ్యతలను పార్టీలోని ముఖ్యనేతలకు అప్పగించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులను కలుపుకుపోయేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. షర్మిల పాదయాత్రకు ఆమె తల్లి విజయమ్మ పూర్తి మద్దతు ఇస్తున్నారు. పీకే టీం సైతం షర్మిలతోనే నడిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్, జగన్ కు కలిసొచ్చిన పాదయాత్ర షర్మిలకు ఏమేరకు కలిసి వస్తుందో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో