60 ఏళ్ళ శభాష్ రాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(డిసెంబర్ 9తో శభాష్ రాజాకు 60 ఏళ్ళు)
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పి.రామకృష్ణ దర్శకత్వంలో రాజశ్రీ సంస్థ నిర్మించిన శభాష్ రాజా చిత్రం 1961 డిసెంబర్ 9న విడుదలయింది. ఏయన్నార్ సరసన రాజసులోచన నాయికగా నటించిన శభాష్ రాజా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించారు.
శభాష్ రాజా చిత్ర కథ, అంతకు ముందు ఏయన్నార్ తో సుందర్ లాల్ నహతా నిర్మించిన శాంతి నివాసం కథను పోలి ఉంటుంది. అంతేకాదు, ఆ చిత్రంలో అన్నదమ్ములుగా నటించిన కాంతారావు, ఏయన్నార్ ఇందులోనూ అవే పాత్రల్లో కనిపించారు. ఇక కాంతారావు జోడీగా దేవిక, నాగేశ్వరరావు జంటగా రాజసులోచన కూడా అందులోనూ నటించడం గమనార్హం!
Also Read
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
ఈ కథ విషయానికి వస్తే, రఘు, రాజా అన్నదమ్ములు. చిన్నతనంలో రఘు చేసిన తప్పిదానికి రాజాపై నేరం మోపుతారు. దాంతో రాజా ఇంట్లోంచి పారిపోతాడు. తరువాత రఘు ఒక్కడే కోటీశ్వరుడై, తన భార్య సరళతో హాయిగా జీవిస్తూ ఉంటాడు. రాజా బయట పిక్ పాకెటర్ గా జీవనం సాగిస్తూ ఉంటాడు. అతని మిత్రుడు మిరియాలుతో కలసి తిరుగుతూ ఉంటాడు రాజా. అతనికి డాన్సర్ రాణి అంటే ఎంతో ఇష్టం. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇలా ఉండగా, రఘును ట్రాప్ లో పడేయడానికి అతని మేనేజర్ మధు ఓ పన్నాగం పన్నుతాడు. మనోరమ అనే అమ్మాయిని, రఘుపై ప్రయోగిస్తాడు. దాంతో రఘు ఆమెకు బానిస అయి, ఇంటినీ ఇల్లాలినీ నిర్లక్ష్యం చేస్తాడు. ఓ సారి రఘు పర్స్ ను రాజా కొట్టేస్తాడు.
అందులో రఘుతో పాటు సరళ ఫోటో చూసి భార్యాభర్తలు అని తెలుసు కుంటాడు. సరళ తన భర్త రఘు కోసం అన్వేషిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు అనుకోని పరిస్థితుల్లో రాజా ఆశ్రయమిస్తాడు. అతనికి సరళ తన వదిన అని తెలుసు. కానీ, ఆ విషయం చెప్పడు. రాజా దొంగ అని తెలిసిన రాణి అతణ్ని అసహ్యించుకుంటుంది. దాంతో నీతిగా బతకాలని ఆశిస్తాడు రాజా. అదే సమయంలో మధు, మనోరమ కలసి రఘును మోసగించి, డబ్బుతో ఉడాయించాలని చూస్తారు. అప్పుడే అక్కడకు వచ్చిన రాణిని, రఘు గదిలో పెట్టి తాళం వేసి పరారవుతారు. రాజా వచ్చే సమయానికి తాగిన మైకంలో ఉన్న రఘు, రాణిని బలాత్కారం చేయబోతాడు. దాంతో రాజా వచ్చి, రఘును చితక్కొట్టి చంపాలనుకుంటాడు. అదే సమయంలో సరళను చూసి, ఆ పని విరమించుకుంటాడు. రఘు తన తప్పిదాన్ని తెలుసుకొని సరళను, రాణిని మన్నించమని వేడుకుంటాడు. పోలీసులు మధు, మనోరమను పట్టుకుంటారు. చివరకు రాజా, రాణి పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది.
రాజాగా ఏయన్నార్, రాణిగా రాజసులోచన, రఘుగా కాంతారావు, సరళగా దేవిక, మధుగా నాగభూషణం, మనోరమగా గిరిజ, మిరియాలుగా రేలంగి నటించారు. ఈ చిత్రానికి సముద్రాల జూనియర్ రచన చేయగా, ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలను సముద్రాల జూనియర్, ఆరుద్ర, కొసరాజు పలికించారు. ఇందులోని అందాల రాణివై..., ఇదిగో ఇదిగో..., మన ఆనందమైన సంసారం...,ఓ వన్నెల వయ్యారి..., లోకాన దొంగలు..., వినోదము కోరేవు... వంటి పాటలు అలరించాయి. శాంతి నివాసం 1960 జనవరి 14న విడుదల కాగా, దాదాపు 22 నెలల తరువాత ఈ సినిమా విడుదలయింది. ఆ చిత్రానికీ, ఈ సినిమాకు కూడా ఘంటసాల సంగీతమే దన్నుగా నిలచింది. అయినా, అందులో ఇందులో పాత్రలు, పాత్రధారులు కూడా ఒకే రకంగా ఉండడం వల్ల ఈ సినిమా ఆ స్థాయి విజయాన్ని సాధించలేక పోయింది.
తాజావార్తలు
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
Nithiin: ఫ్లాప్ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్బ్యాక్కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!