ఎంపీలకు కేంద్రం మరో షాక్.. ఉచిత విమాన ప్రయాణం రద్దు
మన దేశంలో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైలు ప్రయాణాలు ఉచితం లేదా రాయితీలు వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అయితే ఇకపై అలాంటి సౌకర్యాల్లో ఇప్పుడు కోత పడనుంది. ఇప్పటివరకు ఉచితంగా విమానాల్లో ప్రయాణం చేసే ఎంపీలు భవిష్యత్లో టిక్కెట్ కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా ప్రైవేట్ పరం కావడమే. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను వేలంపాటలో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో టాటా గ్రూప్ వెంటనే ఎంపీల ఉచిత విమాన ప్రయాణాలను కట్ చేసింది. టాటా గ్రూప్ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఎంపీలు ఎయిరిండియాలో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసి అనంతరం పార్లమెంట్ సచివాలయానికి రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Read Also: బాణసంచాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
Also Read
మరోవైపు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఉచిత విమాన టికెట్ సదుపాయం కూడా రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా గతంలో కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు 10 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉండేది. ఇది సరిపోకపోతే కేంద్రమంత్రి సిఫారసుతో ఎంపీలు మరిన్ని సీట్లు తీసుకునేవారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ ప్రక్రియను కూడా కేంద్రప్రభుత్వం నిలిపివేసింది. అటు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఏటా ప్రతి ఎంపీకి కేంద్రం రు. 5 కోట్లను మంజూరు చేసేది. అయితే కొన్ని చోట్ల ఈ ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వినబడుతున్నాయి. దాంతో ఎంపీ ల్యాడ్స్ ఫండ్లను కూడా నిలిపివేసిన సంగతి విదితమే. ఇవే కాకుండా పార్లమెంట్ క్యాంటీన్లో ఎంపీలకు చౌకగా లభించే ఆహారాల ధరలను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!