ఎంపీలకు కేంద్రం మరో షాక్.. ఉచిత విమాన ప్రయాణం రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైలు ప్రయాణాలు ఉచితం లేదా రాయితీలు వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అయితే ఇకపై అలాంటి సౌకర్యాల్లో ఇప్పుడు కోత పడనుంది. ఇప్పటివరకు ఉచితంగా విమానాల్లో ప్రయాణం చేసే ఎంపీలు భవిష్యత్లో టిక్కెట్ కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా ప్రైవేట్ పరం కావడమే. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను వేలంపాటలో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో టాటా గ్రూప్ వెంటనే ఎంపీల ఉచిత విమాన ప్రయాణాలను కట్ చేసింది. టాటా గ్రూప్ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఎంపీలు ఎయిరిండియాలో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసి అనంతరం పార్లమెంట్ సచివాలయానికి రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Read Also: బాణసంచాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
Also Read
మరోవైపు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఉచిత విమాన టికెట్ సదుపాయం కూడా రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా గతంలో కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు 10 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉండేది. ఇది సరిపోకపోతే కేంద్రమంత్రి సిఫారసుతో ఎంపీలు మరిన్ని సీట్లు తీసుకునేవారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ ప్రక్రియను కూడా కేంద్రప్రభుత్వం నిలిపివేసింది. అటు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఏటా ప్రతి ఎంపీకి కేంద్రం రు. 5 కోట్లను మంజూరు చేసేది. అయితే కొన్ని చోట్ల ఈ ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వినబడుతున్నాయి. దాంతో ఎంపీ ల్యాడ్స్ ఫండ్లను కూడా నిలిపివేసిన సంగతి విదితమే. ఇవే కాకుండా పార్లమెంట్ క్యాంటీన్లో ఎంపీలకు చౌకగా లభించే ఆహారాల ధరలను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?