ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ గా డివిలియర్స్ రాబోతున్నాడా.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్తో ఇక క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన ఏబీ.. ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ జట్టుతోనే ఉండనున్నాడా.. ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అవుననే అంటున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు. ఇక లీగ్స్ కూడా ఆడనని ప్రకటించాడు. ఈ మధ్యే దుబాయ్లో జరిగిన ఐపీఎల్-14 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడాడు. ఆ తర్వాత అందరిని ఆశ్చర్య పరిచి నవంబర్లో కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. దీంతో ఏబీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
ఆటగాడికి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆర్సీబీకి దూరమైన ఏబీ.. వచ్చే సీజన్లో ఆ ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్గా వచ్చే అవకాశముంది. టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్, ప్రస్తుత ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఈ విషయాన్ని చెప్పాడు. ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఆర్సీబీ కోసం భిన్నమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపాడు. ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడికి బ్యాటింగ్ కోచ్గా నియమిస్తే.. అది ఆటగాళ్లకు, జట్టుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సంజయ్ బంగర్ అన్నాడు. అయితే, బంగర్ చెప్పింది నిజం అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆర్సీబీలో కీలక ఆటగాడైన విరాట్ కోహ్లితో డివిలియర్స్కి మంచి స్నేహాం ఉంది. అంతేకాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంతో కూడా ఏబీకి మంచి సంబంధాలున్నాయి. అయితే, ఏ విషయంపై ఆర్సీబీ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. డివిలియర్స్ 2018లోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు.