Horseshoe Crab: 45 కోట్ల ఏళ్లుగా భూమిపై జీవి.. 1 లీటర్ రక్తం ధర రూ.12.58 లక్షలు!
- ప్రపంచంలోనే ఓ జీవి రక్తానికి అత్యధిక ధర
- దాని పేరు "హార్స్ షూ క్రాబ్"
- 1 లీటర్ రక్తం ధర రూ.12.58 లక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే ఓ జీవి రక్తానికి అత్యధిక ధర పలుకుతుంది. దాని పేరు “హార్స్ షూ క్రాబ్”. ఈ ప్రత్యేకమైన పీత రక్తం ప్రత్యేక రంగులో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని రక్తం వైద్యరంగంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ధర లక్షల్లో ఉంటుంది. వాస్తవానికి.. ఈ రక్తంలో ఒక ప్రత్యేక మూలకం కనుగొనబడింది. ఇది మందులు, ఇంజెక్షన్లలో బ్యాక్టీరియాను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. హార్స్షూ పీతలు వాటి గుర్రపుడెక్క లాంటి ఆకారం నుంచి పేరు పొందాయి. ఇది డైనోసార్ల కంటే పాత జీవిగా చెబుతారు. ఇది దాదాపు 45 కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఉంది. దాని రక్తం యొక్క రంగు నీలం. కారణం హిమోసైనిన్ అనే శ్వాసకోశ వర్ణద్రవ్యం ఇందులో ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం రాగిని కలిగి ఉంది. ఒక లీటర్ గుర్రపుడెక్క పీత రక్తం ధర దాదాపు 15 వేల డాలర్లు అంటే దాదాపు 12 లక్షల 58 వేల రూపాయలు పలుకుతుందట.
READ MORE: Palla Srinivas: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..!
Also Read
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
- PM Modi: ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్బుక్ ఐడీ ఎక్కడదంటే..!
- Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
రక్తం నుంచి బ్యాక్టీరియా ..
గుర్రపుడెక్క పీతల రక్తంలో అతి సూక్ష్మమైన బ్యాక్టీరియాను కూడా గుర్తించవచ్చని 1960లలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పటి నుంచి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, శస్త్రచికిత్సా పరికరాలను క్రిమిరహితం చేయడానికి ఉపయోగిస్తున్నాయి. ప్రతి పీత నుంచి దాదాపు 30% రక్తం సంగ్రహించబడుతుందట. ఒక నివేదిక ప్రకారం.. వైద్య అవసరాల కోసం ప్రతి సంవత్సరం 60 లక్షల గుర్రపుడెక్క పీతలు పట్టుబడుతున్నాయి. రక్త తీస్తుండగా.. దాదాపు 30 శాతం పీతలు చనిపోతాయట. మిగిలిన పీతలను తిరిగి సముద్రంలోకి వదిలేస్తారు. అయితే అవి పూర్తిగా కోలుకుంటాయో లేదో ఎవరికీ తెలియదు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) అమెరికన్ హార్స్షూ పీతను 2016లో దాని రెడ్ లిస్ట్లో ‘హార్స్షూ’ విభాగంలో ఉంచింది. త్వరలో ఇది అంతమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!