ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) కోర్టు భారీ జరిమానా విధించింది. బ్రసెల్స్లో ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గూగుల్కు రూ.20,285 కోట్ల భారీ జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది.
ఈయూ యాంటీట్రస్ట్ నిబంధనల ప్రకారం గూగుల్ చట్టవిరుద్దంగా ఇతర కంపెనీలకు మెరిట్లపై పోటీపడే అవకాశాన్ని, కొత్త ఆవిష్కరణలను నిరాకరించిందని, ముఖ్యంగా ఇది యూరోపియన్ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు ఎంపిక చేసుకోవడంలో ప్రభావం చూపుతుందని ఈయూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఓ కంపెనీకి సంబంధించిన వివరాలు షాపింగ్ సర్చ్ ఇంజన్లో ప్రాముఖ్యత ఇవ్వకుండా ఐటీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు తేలడంతో యూరోపియన్ కోర్టు ఈ విధంగా తీర్చునిచ్చింది.