ఢిల్లీ ఒమిక్రాన్: ఒక్కరోజులో 86శాతం పెరిగిన కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో 923 కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిన్నటి రోజున నమోదైన కేసుల కంటే ఈరోజు 86శాతం అధికంగా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటికే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో సినిమా హాళ్లు, స్కూళ్లను మూసివేశారు. 50 శాతం సీటింగ్లో హోటళ్లు, మెట్రోలు, బార్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని, ఆసుపత్రులను సిద్ధం చేసుకున్నామని, తగినంత ఆక్సీజన్ సరఫరా ఉందని ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించింది.
Read: అమెరికాలో దారుణం: ఒక్కరోజులో 5.12 లక్షల కేసులు…
Also Read
ఒక్కసారిగా 86శాతం మేర కేసులు పెరగడంతో అధికారులు ఆప్రమత్తం అయ్యారు. కరోనా కట్టడికి కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. కరోనా నుంచి 344 మంది కోలుకోగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. కొత్త సంవత్సరం వేడుకలపై ఇప్పటికే ఢిల్లీ సర్కార్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
- Tags
- corona Cases
- Covid19
- Delhi
- Omicron
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం