20 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ కు 20 ఏళ్ళు)
వెంకటేశ్ హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’. 2001 సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ విడుదలయింది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందింది. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
Also Read
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
- Trump: తేడాలు చేస్తే ఒమన్ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
‘నువ్వు నాకు నచ్చావ్’ కథ ఏమిటంటే – శేఖర్, పిన్నమనేని శ్రీనివాస మూర్తి బాల్యమిత్రులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. శ్రీనివాస మూర్తి ఎదుగుదలకు శేఖర్ సాయపడి ఉంటాడు. పట్నంలో శ్రీనివాస మూర్తి కోటీశ్వరుడవుతాడు. అతని వద్దకు తన కొడుకు వెంకీని పంపించి, ఏదైనా ఉద్యోగం చూడమంటాడు. అదే సమయంలో శ్రీనివాస మూర్తి కూతురు నందినికి ఓ అబ్బాయితో వివాహం నిశ్చయమై ఉంటుంది. వెంకీ, శ్రీనివాస మూర్తి గెస్ట్ హౌస్ లో ఉంటూ, ఉద్యోగం చేసుకుంటాడు. అతణ్ణి నందిని, ఆమె చిన్నాన్న కూతురు కలసి ఆటపట్టిస్తూ ఉంటారు. ఓ పెళ్ళికి నందిని, చిన్నాన్న కూతురు వెళ్ళాలను కుంటారు. వారికి తోడుగా వెంకీ వెళ్ళాల్సి వస్తుంది. ఆ సమయంలోనే వెంకీ, నందిని మధ్య అభిమానం చిగురించడం, తరువాత ప్రేమగా మారడం జరుగుతాయి. అయితే వెంకీ వద్దని వారిస్తాడు. అయినా నందిని అతణ్ణే చేసుకోవాలనుకుంటుంది. వారికి టూర్ లో ఓ ఫోటో్గ్రాఫర్ తగులుతాడు. అతను వెంకీ, నందినీ ఫోటోలు తీసి ఉంటాడు. పొరపాటున ఆ ఫోటోలు పెళ్ళి రోజున పెళ్ళికొడుకు చేతికి చిక్కుతాయి. దాంతో పెళ్ళికుమారుని తండ్రి కట్నం పెంచితే ఫర్వాలేదు. లేదంటే నీ కూతురు బండారం బయట పెడతానంటాడు. దానికి శ్రీనివాస మూర్తికి కోపం వస్తుంది. నానా మాటలు అంటాడు. పెళ్ళికొడుకు, అతని బంధువులు వెళ్ళిపోతూంటే వెంకీ వెళ్ళి వారిని ప్రాధేయ పడతాడు. ఈ లోగా వెంకీ మంచి మనసు తెలుసుకున్న శ్రీనివాస మూర్తి, అతనికే తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. దాంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో వెంకీగా వెంకటేశ్, నందినిగా ఆర్తి అగర్వాల్ కనిపించగా, ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, బాబూమోహన్, మల్లికార్జునరావు, ఎమ్మెస్ నారాయణ, సిజ్జు, పృథ్వీ, ఆశా షైనీ, సునీల్, అనంత్, చిట్టిబాబు తదితరులు నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచన చేశారు. కోటి స్వరాలు సమకూర్చగా, సీతారామశాస్త్రి, భువనచంద్ర పాటలు రాశారు. “ఉన్నమాట చెప్పనీవు… ఊరుకుంటే ఒప్పుకోవు…”, “ఓ నవ్వు చాలు…”, “ఆకాశం దిగివచ్చి…”, “నా చూపే నిను…”, “ఓ ప్రియతమా…”, “ఒక్కసారి చెప్పలేవా…” పాటలు అలరించాయి.
అప్పటికే ‘నువ్వే కావాలి’ ఘనవిజయంతో దర్శకుడు కె.విజయభాస్కర్, రచయిత త్రివిక్రమ్ కాంబినేషన్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాకు కూడా ఆరంభం నుంచీ మంచి క్రేజ్ లభించింది. ఆ రోజుల్లో వెంకటేశ్ చిత్రాలలో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా ‘నువ్వు నాకు నచ్చావ్’ నిలచింది. 57 కేంద్రాలలో శతదినోత్సవం చూసిన ఈ చిత్రం మూడు కేంద్రాలలో రజతోత్సవం కూడా జరుపుకుంది. ఈ చిత్రం తమిళంలో విజయ్ హీరోగా ‘వశీగర’గానూ, కన్నడలో ఉపేంద్రతో ‘గౌరమ్మ’గానూ రూపొంది విజయం సాధించింది. బెంగాల్ లో ‘మజ్ను’గా రీమేక్ అయింది.
నంది అవార్డుల్లో సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రానికి ఇచ్చే అక్కినేని అవార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సుహాసిని, బెస్ట్ రైటర్ గా త్రివిక్రమ్, బెస్ట్ కొరియాగ్రాఫర్ గా సుచిత్ర, బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సవితా రెడ్డి నంది అవార్డులు అందుకున్నారు.
తాజావార్తలు
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్లల్లో ప్రయాణం..
-
Allu Arjun: కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్లో హాజరైన అల్లు అర్జున్!
-
Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!