20 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ కు 20 ఏళ్ళు)
వెంకటేశ్ హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’. 2001 సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ విడుదలయింది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందింది. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
Also Read
‘నువ్వు నాకు నచ్చావ్’ కథ ఏమిటంటే – శేఖర్, పిన్నమనేని శ్రీనివాస మూర్తి బాల్యమిత్రులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. శ్రీనివాస మూర్తి ఎదుగుదలకు శేఖర్ సాయపడి ఉంటాడు. పట్నంలో శ్రీనివాస మూర్తి కోటీశ్వరుడవుతాడు. అతని వద్దకు తన కొడుకు వెంకీని పంపించి, ఏదైనా ఉద్యోగం చూడమంటాడు. అదే సమయంలో శ్రీనివాస మూర్తి కూతురు నందినికి ఓ అబ్బాయితో వివాహం నిశ్చయమై ఉంటుంది. వెంకీ, శ్రీనివాస మూర్తి గెస్ట్ హౌస్ లో ఉంటూ, ఉద్యోగం చేసుకుంటాడు. అతణ్ణి నందిని, ఆమె చిన్నాన్న కూతురు కలసి ఆటపట్టిస్తూ ఉంటారు. ఓ పెళ్ళికి నందిని, చిన్నాన్న కూతురు వెళ్ళాలను కుంటారు. వారికి తోడుగా వెంకీ వెళ్ళాల్సి వస్తుంది. ఆ సమయంలోనే వెంకీ, నందిని మధ్య అభిమానం చిగురించడం, తరువాత ప్రేమగా మారడం జరుగుతాయి. అయితే వెంకీ వద్దని వారిస్తాడు. అయినా నందిని అతణ్ణే చేసుకోవాలనుకుంటుంది. వారికి టూర్ లో ఓ ఫోటో్గ్రాఫర్ తగులుతాడు. అతను వెంకీ, నందినీ ఫోటోలు తీసి ఉంటాడు. పొరపాటున ఆ ఫోటోలు పెళ్ళి రోజున పెళ్ళికొడుకు చేతికి చిక్కుతాయి. దాంతో పెళ్ళికుమారుని తండ్రి కట్నం పెంచితే ఫర్వాలేదు. లేదంటే నీ కూతురు బండారం బయట పెడతానంటాడు. దానికి శ్రీనివాస మూర్తికి కోపం వస్తుంది. నానా మాటలు అంటాడు. పెళ్ళికొడుకు, అతని బంధువులు వెళ్ళిపోతూంటే వెంకీ వెళ్ళి వారిని ప్రాధేయ పడతాడు. ఈ లోగా వెంకీ మంచి మనసు తెలుసుకున్న శ్రీనివాస మూర్తి, అతనికే తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. దాంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో వెంకీగా వెంకటేశ్, నందినిగా ఆర్తి అగర్వాల్ కనిపించగా, ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, బాబూమోహన్, మల్లికార్జునరావు, ఎమ్మెస్ నారాయణ, సిజ్జు, పృథ్వీ, ఆశా షైనీ, సునీల్, అనంత్, చిట్టిబాబు తదితరులు నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచన చేశారు. కోటి స్వరాలు సమకూర్చగా, సీతారామశాస్త్రి, భువనచంద్ర పాటలు రాశారు. “ఉన్నమాట చెప్పనీవు… ఊరుకుంటే ఒప్పుకోవు…”, “ఓ నవ్వు చాలు…”, “ఆకాశం దిగివచ్చి…”, “నా చూపే నిను…”, “ఓ ప్రియతమా…”, “ఒక్కసారి చెప్పలేవా…” పాటలు అలరించాయి.
అప్పటికే ‘నువ్వే కావాలి’ ఘనవిజయంతో దర్శకుడు కె.విజయభాస్కర్, రచయిత త్రివిక్రమ్ కాంబినేషన్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాకు కూడా ఆరంభం నుంచీ మంచి క్రేజ్ లభించింది. ఆ రోజుల్లో వెంకటేశ్ చిత్రాలలో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా ‘నువ్వు నాకు నచ్చావ్’ నిలచింది. 57 కేంద్రాలలో శతదినోత్సవం చూసిన ఈ చిత్రం మూడు కేంద్రాలలో రజతోత్సవం కూడా జరుపుకుంది. ఈ చిత్రం తమిళంలో విజయ్ హీరోగా ‘వశీగర’గానూ, కన్నడలో ఉపేంద్రతో ‘గౌరమ్మ’గానూ రూపొంది విజయం సాధించింది. బెంగాల్ లో ‘మజ్ను’గా రీమేక్ అయింది.
నంది అవార్డుల్లో సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రానికి ఇచ్చే అక్కినేని అవార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సుహాసిని, బెస్ట్ రైటర్ గా త్రివిక్రమ్, బెస్ట్ కొరియాగ్రాఫర్ గా సుచిత్ర, బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సవితా రెడ్డి నంది అవార్డులు అందుకున్నారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..