నేడే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం..షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ హైటెక్స్ వేదికగా ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు గులాబీ దళం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశారు.
సభా వేదిక చుట్టూ 8 పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకల సందర్భంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలు గులాబీమయమైపోయాయి. ఎటు చూసినా భారీ ప్లెక్సీలు, ఆకట్టుకునే కటౌట్లే దర్శనమిస్తున్నాయి. సభావేదికను గ్రాండ్గా తీర్చిదిద్దారు టీఆర్ఎస్ నేతలు.ప్లీనరీకి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరవుతారు. వారికోసం నోరూరించే వంటకాలూ సిద్ధమవుతున్నాయి.మరోవైపు…ప్లీనరీలో ఆటా…పాటాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దీనికి సంబంధించిన రిహార్సల్స్లో మునిగితేలుతున్నారు కళాకారులు.
Also Read
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!