జోరు మీదున్న టీమిండియా..నేడు న్యూజిలాండ్ తో చివరి టీ20
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ-20 సిరీస్ వైట్వాష్పై కన్నేసింది రోహిత్సేన. వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా…చివరి ఫైట్కు రెడీ అయ్యింది. ఈ సిరీస్ తర్వాత టెస్టు ప్రారంభం కానుండటంతో కొన్ని ప్రయోగాలు చేయనుంది. సొంత గడ్డపై టీమిండియా దుమ్మురేపుతోంది. టీ-20 సిరీస్లో ఇప్పటికే రెండింటిలో గెలిచిన సిరీస్ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కేప్టెన్సీలో టీమిండియా అందుకున్న తొలి టీ20 సిరీస్ ఇదే. అదే ఊపుతో చివరి మ్యాచ్ను విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.న్యూజిలాండ్ ఇంకా బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్లల్లో ఓడింది.
కనీసం చివరి మ్యాచ్లోనైనా గెలిచి, వైట్వాష్ నుంచి తప్పించుకోవాలని తాపత్రయం పడుతోంది. కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా, కివీస్ తలపడనున్నాయ్. ఫామ్ చూస్తుంటే…రెండు టీమ్లు బలంగా కన్పిస్తున్నాయ్. ఐతే టీమిండియా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం ఉంది.ఇక మూడో మ్యాచ్లో ప్రయోగాలు చేయాలని డిసైడయ్యింది. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్.. ప్రయోగాల్లో తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ నెల 25 నుంచి కివీస్తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
Also Read
దాంతో టెస్ట్ సిరీస్ కోసం సీనియర్లకు విశ్రాంతి ఇవ్వనున్నాడు. వారి స్థానంలో కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నాడు. ఏకంగా నాలుగు మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్ కేఎల్ రాహుల్కు రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. అతడి స్థానంలో గైక్వాడ్ను తీసుకోవాలని భావిస్తోంది. రోహిత్శర్మతో కలిసి ఓపెనర్గా పంపించే ఛాన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2021 సీజన్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన గైక్వాడ్కు ఇదే తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుంది. ఐపీఎల్తో వెలుగులోకి వచ్చిన మరో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఆడే అవకాశం ఉంది. రిషభ్ పంత్కు విశ్రాంతిని ఇచ్చి, అతని స్థానంలో ఇషాన్ను తీసుకోవాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రిషభ్ పంత్..ఇదే న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ను ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మొదలైనప్పటి నుంచి విరామం లేకుండా క్రికెట్ ఆడుతోన్న పంత్కు రెస్ట్ ఇచ్చి.. ఇషాన్ కిషన్ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. ఇక బౌలింగ్లో ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ లేదా దీపక్ చాహర్లల్లో ఒకరికి రెస్ట్ ఇచ్చి, అవేష్ ఖాన్ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. స్పిన్ ట్విన్స్ అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లకు బదులుగా చాహల్ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది మేనేజ్మెంట్.
- Tags
- india
- new zealand
- T20 cricket
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!