జగన్ మానసిక స్థితి సరిగా లేదు.. లండన్ వెళ్లి వైద్యం చేయించుకున్నారు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హాట్ కామెంట్లు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్.. వైఎస్ జగన్ మానసిక స్థితి బాగాలేదని ప్రజలు గమనించారని.. అందుకోసమే లండన్ వెళ్లి వైద్యం చేయించుకున్నారని.. అది సెట్ అవ్వని పరిస్థితిలో రాష్ట్ర అభివృద్ధిని చూసి మరింత మానసిక శోభకు గురైతే ప్రభుత్వం తరఫున అన్ని విదాల ఆయనకు సహకరిస్తూ మంచి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాంమని సెటైర్లు వేశారు కార్మిక శాఖ మంత్రి సుభాష్.. ఇక, మాజీ ముఖ్యమంత్రి జగన్ తనని విమర్శిస్తే స్వీకరించలేడు.. విమర్శించడం ఇష్టం.. కానీ, విమర్శిస్తే స్వీకరించలేడు.. రాజకీయ నాయకుడుగా మంచి విమర్శలు చేస్తే వాటిని స్వీకరించాలి అన్నారు.. స్కూల్ పిల్లాడిలాగా అటెండెన్స్ కోసం అసెంబ్లీకి వచ్చారు.. అటెండెన్స్ వేసుకున్న వెంటనే పారిపోయారంటూ ఎద్దేవా చేశారు..
హైస్కూల్ గ్రౌండ్లో పడిన పిడుగు.. ఇద్దరు విద్యార్థులు మృతి
హైస్కూల్ గ్రౌండ్లో విద్యార్థులు అంతా సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. జరిగిన ఓ ఘటన ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది.. కర్నూలు జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కౌతాళం మండలం కాత్రికిలో పిడుగు పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి.. విద్యార్థుల మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.. హైస్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. కాగా, ఇటు ఏపీతో పాటు.. అటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి.. ఈ సమయంలో.. పిడుగులు పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇక, మూగ జీవాలు కూడా పిడుగుపాటుకు మృత్యువాత పడుతున్నాయి.. అయితే, వర్షాలు పడుతోన్న సమయంలో.. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో.. చెట్లకు దూరంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తోన్న విషయం విదితమే..
ఎమ్మార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడి దారుణ హత్య..
ఎమ్మార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్గా ఉన్న లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యాడు.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.. గుంతకల్ నుండి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తుండగా హత్య చేశారు.. లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టారు.. ఈ ఘటనతో కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గుర్తుతెలియని వ్యక్తులు. అయితే, తీవ్రగాయాలపాలైన లక్ష్మీనారాయణను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది.. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే లక్ష్మీనారాయణ ప్రాణాలు విడిచినట్టుగా చెబుతున్నారు.. అయితే, ఎమ్మార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడిగా పనిచేస్తూ.. ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్గా ఉన్న లక్ష్మీనారాయణపై ఎవరు ? దాడి చేశారు.. ఆయనపై అత్యంత దారుణంగా దాడిచేయాల్సిన అవసరం ఏం వచ్చింది..? ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు..? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
గుంటూరు మేయర్ ఎన్నికలో ట్విస్ట్..!
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక టీడీపీ, వైసీపీల్లో హైటెన్షన్ పుట్టిస్తుంది.. నిన్నటివరకూ ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ అనుహ్యంగా ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఎలర్ట్ అయ్యారు.. మరోవైపు కూటమి అభ్యర్దిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు.. మేయర్ ఎన్నికపై వైసీపీ విప్ జారీ చేసింది. అయితే, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ తనపదవికి రాజీనామా చేశారు. దీంతో మేయర్ ఎన్నిక అనివార్యం అయ్యింది.. టీడీపీ, వైసీపీ పార్టీలు మేయర్ పదవికోసం పోటీ పడుతుండడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిలో మొదలయ్యింది. దీంతో వైసీపీ, టీడీపీ నేతలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. వాస్తవానికి కార్పొరేషన్ లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్ల బలం ఉంది. టీడీపీకి 9, జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు ఐదుగురు, ఎన్నికల తర్వాత 11 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోచేరారు. దీంతో కూటమికి కార్పొరేషన్ లో బలం పెరిగింది.
కర్రెగుట్ట కూంబింగ్ లో బిగ్ ట్విస్ట్..
గత ఆరు రోజులుగా కర్రె గుట్టలలో భద్రతా బలగాలు కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.. ఈ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజాపూర్, తెలంగాణ సరిహద్దు కర్రె గుట్టలలో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. ఈ సొరంగంలో ఒక ప్రాంతం నుంచి మరో మార్గం ద్వారా బయటికి వెళ్లేందుకు వీలుగా ఉందని భద్రతాదళాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సొరంగాన్ని స్థావరంగా చేసుకొని మావోయిస్టులు దాడులకు తెగబడ్డారని పేర్కొన్నాయి. అయితే, ఈ సొరంగంలో సరైన గాలి నీరు వాతావరణం ఉంది.. అంతే కాకుండా ఇక్కడ విశాలమైన ప్రాంతం కూడా ఉందన్నారు.ఈ సొరంగంలో 1000 మంది పట్టేంత స్థలం ఉందని అధికారులు వెల్లడించారు.. కాగా, కర్రెగుట్ట కొండల్లో నక్సలైట్లపై కొనసాగుతున్న ఆపరేషన్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. ఎండ వేడిమి, 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య శ్రమించి.. ఎట్టకేలకు వారి స్థావరానికి చేరుకోగలిగారు. అయితే భద్రతా దళాలు అక్కడికి చేరుకోకముందే మావోయిస్టులు తమ స్థావరాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇక్కడ వారు ఉన్నట్టు ఆనవాళ్లు దొరికాయి. ఈ గుహలో చాలా రోజుల పాటు వెయ్యి మందికి పైగా ఆశ్రయం పొందవచ్చని చెప్పుకొచ్చారు. ఈ సొరంగానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చిత్రీకరించారు.
‘‘ఉగ్రవాదులు మతాన్ని అడగలేదు’’.. పహల్గామ్ దాడిపై కాంగ్రెస్ మంత్రి కామెంట్స్..
పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో అమాయకపు టూరిస్టులు 26 మంది మరణించారని యావత్ దేశం తీవ్ర బాధలో ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుంబంధ టీఆర్ఎఫ్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఈ దాడికి పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ ముష్కరులు టార్గెట్ చేయడాన్ని భారత సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఇదిలా ఉంటే, కొందరు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పాకిస్తాన్తో యుద్ధం వద్దని చెప్పడం వివాదాస్పదమైంది. ఇప్పుడు ఆయన క్యాబినెట్లోని మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఉగ్రవాదులు దాడికి పాల్పడే ముందు వారి మతాన్ని అడిగారని నేను అనుకోవడం లేదని అన్నారు.
‘‘మీ భార్యా పిల్లలు భారతీయులేనా?’’.. కాంగ్రెస్ ఎంపీ పాకిస్తాన్ లింకులపై సీఎం సంచలనం..
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ టార్గెట్గా అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘మీరు 15 రోజులు పాకిస్తాన్లో బస చేశారా..? మీ భార్య పాకిస్తాన్కి చెందిన ఎన్జీవో నుంచి జీతం పొందుతుందా..?’’ అని ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా గొగోయ్కి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ భార్య, వారి పిల్లల పౌరసత్వ స్థితిని కూడా ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియా పోస్టులో సీఎం ఎంపీ పేరును ప్రత్యక్షంగా చెప్పకపోయినా, ఇది కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా తెలుస్తోంది. గతంలో చాలాసార్లు గొగోయ్కి ఆయన భార్యకు పాకిస్తాన్తో సంబంధం ఉందని ఆరోపించారు.
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 934 జాబ్స్.. మిస్ చేసుకోకండి
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి ఇదే మంచి సమయం. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) స్టీల్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 934 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకానున్నాయి. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు ఉండాలి. రాయ్పూర్, భువనేశ్వర్, రూర్కెలా, బొకారో, దుర్గాపూర్, హోస్పేట్, ఝార్సుగూడ వంటి అనేక ప్రదేశాలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 – రూ.1,70,000 వరకు జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 500 చెల్లించాలి. SC, ST, PwBD, మాజీ సైనికుల వర్గాలకు చెందిన వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 8 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
ప్లేఆప్స్ రేసులో ముందుకు దూసుకెళ్లేది ఎవరో? మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్.
నేడు జరగబోయే డబుల్ హెడర్ లో భాగంగా.. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడతాయి. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబై వరుస విజయాలతో దూసుకవెళ్తోంది. ఇప్పటికే MI వరుసగా నాలుగు మ్యాచ్లను గెలిచి మరో విజయంపై కన్నేశారు. ప్రస్తుత సీజన్లో ఏప్రిల్ 4న లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇరుజట్లు తలపడినప్పుడు ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడానిధికి సమయం వచ్చింది. పాయింట్ల పట్టికలో రెండు జట్లు ప్రస్తుతం 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. కానీ, మెరుగైన నికర రన్ రేట్ ఆధారంగా ముంబై ఐదవ స్థానంలో ఉండగా, LSG ఆరో స్థానంలో ఉంది. రెండూ 9 మ్యాచ్ల్లో ఐదు గెలిచి, నాలుగు ఓడిపోయాయి. ఎల్ఎస్జి తన చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. కెప్టెన్ రిషబ్ పంత్ పేలవమైన ఫామ్ లక్నో జట్టుకు ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది లక్నో సూపర్ జెయింట్స్. దీనితో మొదట బ్యాటింగ్ చేయనుంది ముంబై ఇండియన్స్. ఇక నేటి ఇరుజట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ.. ఏమన్నాడంటే..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈడీ అధికారులకు లేఖ రాశారు. తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ అందులో తెలిపారు. సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఇప్పటికే మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28న విచారఖు రావాలంటూ తెలిపారు. తాను రేపు విచారణకు హాజరు కాలేనని మహేశ్ బాబు తాజాగా లేఖ రాశారు. విచారణ కోసం మరో డేట్ ను ఫిక్స్ చేయాలని కోరారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సాయి సూర్య డెవలపర్ సంస్థలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ సంస్థ ఒకే ఫ్లాట్ ను పది మందికి అమ్మారని.. అలా కస్టమర్ల దగ్గరి నుంచి రూ.100 కోట్ల దాకా అక్రమంగా వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సంస్థకు మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ప్రమోట్ చేశారు. ఇందుకోసం మహేశ్ బాబు రూ.5.9 కోట్లు తీసుకున్నారు. ఇందులో 3.9 కోట్ల రూపాయలను చెక్కు రూపంలో తీసుకొని రెండు కోట్ల రూపాయలను తీసుకున్నారు మహేష్ బాబు. దీంతో మహేశ్ బాబును కూడా విచారణకు రావాలంటూ అధికారులు ఆదేశించారు. మహేశ్ బాబు ప్రమోట్ చేయడంతో వందలాది మంది ఈ సాయిసూర్య డెవలపర్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. కానీ సంస్థ వ్యవహార శైలిపై అనుమానాలు రావడంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు. కానీ అప్పటికే కస్టమర్లు వందల కోట్లు పెట్టుబడులు పెట్టేశారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఇందులో మహేశ్ పాత్ర ఎంత ఉందనేది విచారణలో తేలిపోనుంది.
ప్రియదర్శికి పెరుగుతున్న మార్కెట్.. కమెడియన్ గా మానేస్తాడా..?
ప్రియదర్శి హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు. తన ప్రతి సినిమాలో కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ హీరోగా తనకంటూ గ్యారెంటీ హిట్ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. హీరోగా చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టినా.. వరుస సక్సెస్ లు అందుకోవడంతో ఆయన మార్కెట్ పెరుగుతుంది. ఇప్పటికే బలగం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత కోర్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సారంగపాణి జాతకం మూవీతో మరో హిట్ ఖాతాలో పడిపోయింది. హీరోగా ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ ఏదో ఒక రకమైన ఎఫెక్ట్ ను ప్రేక్షకుల్లో చూపిస్తున్నాయి. ఈ నడుమ ప్రియదర్శిని చూస్తుంటే ఆయన కమెడియన్ గా సినిమాలను బాగా తగ్గించేశాడు. హీరోగా సక్సెస్ అవుతున్నాడు కాబట్టి కమెడియన్ గా చేస్తే బాగోదని ఫిక్స్ అయ్యాడు. అంతే కదా మరి.. ఎవరైనా సరే హీరోగా ఎదగాలని ఆశపడుతారు. అంతేగానీ కమెడియన్ స్థాయిలో ఆగిపోవాలని ఎన్నడూ కోరుకోరు. ఇప్పుడు ప్రియదర్శి కూడా ఇదే బాటలో వెళ్తున్నాడు. హీరోగా ఆయనకు అవకాశాలు, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతున్నాయి. ప్రియదర్శి సినిమా చేశాడు అంటే కచ్చితంగా ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది అనే ముద్ర పడుతోంది. అందుకే ప్రియదర్శి సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడుతోంది. ప్రేక్షకులు కూడా ప్రియదర్శి సినిమా అంటే థియేటర్లకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లెక్కన ఇంకో రెండు హిట్లు పడితే మాత్రం ప్రియదర్శి పూర్తిగా హీరోగానే సెటిల్ అయిపోవడం ఖాయం.