Off The Record: మీటింగ్ పెట్టినపుడల్లా మంత్రులపై చంద్రబాబు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు..?
- కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు రుసరుసలు..
- పదేపదే హెచ్చరిస్తున్నా మారడం లేదని ఆగ్రహం..
- కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సమన్వయం ఏదని ఫైర్..
- అధికారులతో కోఆర్డినేషన్ ఎందుకు లేదని వ్యాఖ్యలు..
- మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదా?..
- మంత్రులు, ఎమ్మెల్యేల కోల్డ్వార్ వల్లే కోఆర్డినేషన్ దెబ్బతింటోందా?..
- మంత్రుల తీరుతో చూసీచూడనట్టు అధికారులు వదిలేస్తున్నారా?..
- నియోజకవర్గాల అభివృద్ధిపైనా సమన్వయలోపం ఎఫెక్ట్ చూపిస్తోందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటుతోంది. కొన్ని నెలలుగా సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరితో పాటు కొంతమంది అధికారుల తీరు పై కూడా అసహనంగా వున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోందట. సీఎం చంద్రబాబు గతంలో మంత్రులు, ఎంపీలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు కలిసి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకోవాలి. అధికారులతో శాఖాపరంగా చర్చిస్తూ ఎప్పటికప్పుడు నిధులపై దృష్టి పెట్టాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు అసలు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదనే చర్చ కూటమిలో జరుగుతోందట. కోల్డ్వార్తో మాట్లాడుకోలేక, అటు నిధులను సంపాదించలేకపోతున్నారు. మంత్రుల తీరుతో అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే చర్చ బాగా జరుగుతోంది.
Read Also: Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అనేక ప్రణాళికలు
Also Read
ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయలోపం ఎఫెక్ట్ నియోజకవర్గాల అభివృద్దిపైనా పడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. పలువురు ఎంపీలతో కూడా ఇదే పరిస్థితి. చాలా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య కో-ఆర్డినేషన్ మచ్చుకైనా కానరావడం లేదని పార్టీలో డిస్కషన్ సాగుతోంది. ఇక జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి పతాకస్థాయికి చేరింది. మార్చి 31 లోపు ఉపయోగించు కోవాల్సిన నిధులు కేంద్రం దగ్గర నుంచి సగం కూడా తీసుకురాలేకపోయారని సీఎం ఫైరవుతున్నట్టు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వున్న వారి లిస్టు రెడీ అవుతోందని కూటమి నాయకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..