Off The Record: మీటింగ్ పెట్టినపుడల్లా మంత్రులపై చంద్రబాబు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు..?
- కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు రుసరుసలు..
- పదేపదే హెచ్చరిస్తున్నా మారడం లేదని ఆగ్రహం..
- కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సమన్వయం ఏదని ఫైర్..
- అధికారులతో కోఆర్డినేషన్ ఎందుకు లేదని వ్యాఖ్యలు..
- మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదా?..
- మంత్రులు, ఎమ్మెల్యేల కోల్డ్వార్ వల్లే కోఆర్డినేషన్ దెబ్బతింటోందా?..
- మంత్రుల తీరుతో చూసీచూడనట్టు అధికారులు వదిలేస్తున్నారా?..
- నియోజకవర్గాల అభివృద్ధిపైనా సమన్వయలోపం ఎఫెక్ట్ చూపిస్తోందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటుతోంది. కొన్ని నెలలుగా సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరితో పాటు కొంతమంది అధికారుల తీరు పై కూడా అసహనంగా వున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోందట. సీఎం చంద్రబాబు గతంలో మంత్రులు, ఎంపీలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు కలిసి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకోవాలి. అధికారులతో శాఖాపరంగా చర్చిస్తూ ఎప్పటికప్పుడు నిధులపై దృష్టి పెట్టాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు అసలు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదనే చర్చ కూటమిలో జరుగుతోందట. కోల్డ్వార్తో మాట్లాడుకోలేక, అటు నిధులను సంపాదించలేకపోతున్నారు. మంత్రుల తీరుతో అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే చర్చ బాగా జరుగుతోంది.
Read Also: Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అనేక ప్రణాళికలు
Also Read
ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయలోపం ఎఫెక్ట్ నియోజకవర్గాల అభివృద్దిపైనా పడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. పలువురు ఎంపీలతో కూడా ఇదే పరిస్థితి. చాలా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య కో-ఆర్డినేషన్ మచ్చుకైనా కానరావడం లేదని పార్టీలో డిస్కషన్ సాగుతోంది. ఇక జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి పతాకస్థాయికి చేరింది. మార్చి 31 లోపు ఉపయోగించు కోవాల్సిన నిధులు కేంద్రం దగ్గర నుంచి సగం కూడా తీసుకురాలేకపోయారని సీఎం ఫైరవుతున్నట్టు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వున్న వారి లిస్టు రెడీ అవుతోందని కూటమి నాయకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
IND vs SL: గాలె టెస్టులో అంపైర్ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ ?
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!