‘అందరూ బావుండాలి…’ థియేటర్లో మనందరం ఉండాలి: ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్గా ఈ సినిమా తెరకెక్కింది. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్లు సంయుక్తంగా నిర్మించారు. 1100 సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్లో నిర్మిస్తోన్న తొలి చిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర నటీనటులతో దీనిని తీశారు. మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా అలీకి అభినందనలు తెలియచేశారు యంగ్ రెబల్స్టార్ ప్రభాస్.
Read Also : భార్యలతో పాటు స్టార్స్ అంతా ఒకేచోట… పిక్ వైరల్
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
ఆయన మాట్లాడుతూ ‘‘అలీ గారు అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ని పెట్టి సినిమాలు తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన బ్యానర్ సౌండ్ బావుంది. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ దగ్గర అసిస్టెంట్గా చేసిన రాకేశ్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారట. అలీ,నరేశ్ గార్లతో పాటు టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. అలీ మాట్లాడుతూ ‘‘ప్రభాస్తో నేను ‘యోగి’, ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’,‘ బిల్లా’, ‘రెబల్’ ఇలా అనేక చిత్రాల్లో నటించిన పరిచయంతో మా సినిమా మొదటి సాంగ్ రిలీజ్ చేయాలి అని అడిగాను. ప్రభాస్ ఇండియాలో లేనప్పటికి నా మీద అభిమానంతో మా సినిమా గురించి మాట్లాడుతూ వీడియో చేసి పంపించారు. మా ‘అందరూ బావుండాలి…’ సినిమా ప్రమోషన్ను ప్రభాస్తో ప్రారంభించటం ఆనందంగా ఉంది. మా సినిమా మొదటి పాట లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలవుతుంది. కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. పరిస్థితులు చక్కదిద్దుకోగానే మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రంలో శివబాలాజీ, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, శివారెడ్డి, సప్తగిరి, పృధ్వీ, రామ్జగన్, భద్రం, లాస్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
- Tags
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుకు బ్రేక్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్..
-
Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్సిగ్నల్
-
మందు అనుకుని ఎయిర్పాడ్స్ను మింగేసిన మహిళ.! ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవ్వాల్సిందే
-
Siddaramaiah: సిద్ధరామయ్య రాజీనామాపై ఉత్కంఠ! హాట్ టాఫిక్గా ఓ సీనియర్ నేత వ్యాఖ్యలు
-
SRH Vs RR: వైభవ్ విధ్వంసం.. 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!