Site icon NTV Telugu

Y. S. Sharmila: ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్లు ఇస్తా..

Ys Sharmila

Ys Sharmila

ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్లు ఇస్తాంటూ వై.ఎస్‌ షర్మిళ అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం లక్ష్మీపల్లి గ్రామంలో షర్మిల పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఆమె మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ అని కేసీఅర్ మోసం చేశారని మండిపడ్డారు. తీసుకున్న రుణాలు కట్టలేక ఉన్న పొలాలు అమ్ముకుంటున్నామన్నారు. బ్రతుకు దెరువు లేక ఇంకా బొంబాయి పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారని తెలిపారు. కేసీఅర్ ప్రభుత్వంతో మాకు ఏం మేలు జరగలేదని విమర్శించారు. అన్ని ధరలు పెంచి బ్రతుకు కష్టం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ ఉన్నప్పుడు చల్లగా బ్రతికినామని షర్మిళ వ్యాఖ్యానించారు.

కేసీఅర్ చేసిన మోసాలు ప్రజలు తెలుసుకుంటున్నారని అన్నారు. గ్రామాల్లో కనీసం ఆసరా పెన్షన్లు ఇచ్చే దిక్కు కూడా లేదని ఎద్దేవ చేశారు. వ్యవసాయం పండుగ అని కేసీఅర్ అంటున్నారు…కానీ స్వయంగా రైతులే దండుగ అంటున్నారని షర్మిళ సంచళన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు లేక ఇంకా బ్రతుకు దేరువుకు వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక కేసీఅర్ ను నమ్మొద్దని, వైఎస్సార్ పాలన తేవాలి అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కి అధికారం ఇవ్వండని షర్మిళ పేర్కొన్నారు. వైఎస్సార్ పథకాలు అన్ని అమలు చేస్తా అని స్పష్టం చేశారు. తీసుకున్న రుణాలు అన్ని మాఫీ చేస్తాఅని అన్నారు. పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తానని, ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్లు ఇస్తామని వై.ఎస్‌. షర్మిళ వ్యాఖ్యానించారు.
Nandamuri Balakrishna: సోషల్ మీడియా వైపు వెళ్లకండి.. విద్యార్థులకు బాలయ్య సూచన

Exit mobile version