Avinash Reddy: వివేకా హత్య కేసు.. నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Avinash Reddy: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రానున్నారు. అవినాష్ రెడ్డికి అడిగే ప్రశ్నలు ఏంటి ఎంతటైం ప్రశ్నిస్తారు.. మళ్లీ వస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ ఎపిసోడ్ని వైసీపీ నేతలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. వివేకానంద హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పటివరకు చాలా మందిని ప్రశ్నించారు. వారంతా చాలా సాధారణ వ్యక్తులు కాగా.. ప్రజలకు పెద్దగా తెలియదు. ఇప్పుడు తొలిసారిగా ఓ ప్రజాప్రతినిధిపై సీబీఐ విచారణ చేపట్టింది. అందుకే ఈ విచారణ తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. అందులో అవినాష్రెడ్డి సీఎం జగన్ సోదరుడు. వివేకా కూతురు సునీత కూడా అతనిపై అనుమానం వ్యక్తం చేసింది. హత్యకేసులో అతడితోపాటు తమ తండ్రి పాత్ర కూడా ఉందని మొదటి నుంచి నమ్ముతున్నారు. ఇన్నాళ్లు చాలా మందకొడిగా సాగుతున్న సీబీఐ విచారణ తెలంగాణ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి వేగం పుంజుకుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎప్పటి నుంచో అవినాష్ రెడ్డిగా పిలుస్తారు, ఆయన్ను విచారిస్తారనే ప్రచారం జరుగుతున్నా.. ఇన్నాళ్లకు ఆయన్ను పిలిచి విచారిస్తున్నారు.
Read also: Waltair Veerayya: వరంగల్ కు వాల్తేరు వీరయ్య టీమ్.. గెస్ట్ గా ఆర్ఆర్ఆర్ హీరో..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఈ కేసులో నిజానిజాలు ఇంకా బయటపెట్టాలని కుటుంబ సభ్యులు, పలువురు కోరుతున్నారు. సీబీఐ అధికారులపై అధికార పార్టీ వైసీపీ ఒత్తిడి తెచ్చిందని అందుకే విచారణ ఆలస్యమవుతోందని కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. అందుకే విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ నుంచే విచారణ కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణలో తొలిదశ విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. తొలుత నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు మరుసటి రోజు విచారణకు రావాలని కోరారు. అంటే జనవరి 24న నోటీసులు జారీ చేసిన అధికారులు జనవరి 25న విచారణకు పిలిచారని.. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూళ్ల ప్రకారం తాను చేయాల్సింది చాలా ఉందన్నారు. ఐదు రోజులు పాటు విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు సమాధానమిచ్చారు. అవినాష్ రెడ్డి వివరణను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 28న అంటే ఈరోజు (శనివారం) విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈరోజు మూడు గంటల నుంచి హైదరాబాద్ లో సీబీఐ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో… సీబీఐ ఎలాంటి ట్విస్ట్లు ఇవ్వబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
KTR Nizamabad Tour: నేడే నిజామాబాద్కు మంత్రి కేటీఆర్.. శంకుస్థాపనలు, బహిరంగ సభ
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!