Avinash Reddy: వివేకా హత్య కేసు.. నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Avinash Reddy: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రానున్నారు. అవినాష్ రెడ్డికి అడిగే ప్రశ్నలు ఏంటి ఎంతటైం ప్రశ్నిస్తారు.. మళ్లీ వస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ ఎపిసోడ్ని వైసీపీ నేతలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. వివేకానంద హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పటివరకు చాలా మందిని ప్రశ్నించారు. వారంతా చాలా సాధారణ వ్యక్తులు కాగా.. ప్రజలకు పెద్దగా తెలియదు. ఇప్పుడు తొలిసారిగా ఓ ప్రజాప్రతినిధిపై సీబీఐ విచారణ చేపట్టింది. అందుకే ఈ విచారణ తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. అందులో అవినాష్రెడ్డి సీఎం జగన్ సోదరుడు. వివేకా కూతురు సునీత కూడా అతనిపై అనుమానం వ్యక్తం చేసింది. హత్యకేసులో అతడితోపాటు తమ తండ్రి పాత్ర కూడా ఉందని మొదటి నుంచి నమ్ముతున్నారు. ఇన్నాళ్లు చాలా మందకొడిగా సాగుతున్న సీబీఐ విచారణ తెలంగాణ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి వేగం పుంజుకుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎప్పటి నుంచో అవినాష్ రెడ్డిగా పిలుస్తారు, ఆయన్ను విచారిస్తారనే ప్రచారం జరుగుతున్నా.. ఇన్నాళ్లకు ఆయన్ను పిలిచి విచారిస్తున్నారు.
Read also: Waltair Veerayya: వరంగల్ కు వాల్తేరు వీరయ్య టీమ్.. గెస్ట్ గా ఆర్ఆర్ఆర్ హీరో..
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
- CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
ఈ కేసులో నిజానిజాలు ఇంకా బయటపెట్టాలని కుటుంబ సభ్యులు, పలువురు కోరుతున్నారు. సీబీఐ అధికారులపై అధికార పార్టీ వైసీపీ ఒత్తిడి తెచ్చిందని అందుకే విచారణ ఆలస్యమవుతోందని కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. అందుకే విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ నుంచే విచారణ కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణలో తొలిదశ విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. తొలుత నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు మరుసటి రోజు విచారణకు రావాలని కోరారు. అంటే జనవరి 24న నోటీసులు జారీ చేసిన అధికారులు జనవరి 25న విచారణకు పిలిచారని.. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూళ్ల ప్రకారం తాను చేయాల్సింది చాలా ఉందన్నారు. ఐదు రోజులు పాటు విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు సమాధానమిచ్చారు. అవినాష్ రెడ్డి వివరణను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 28న అంటే ఈరోజు (శనివారం) విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈరోజు మూడు గంటల నుంచి హైదరాబాద్ లో సీబీఐ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో… సీబీఐ ఎలాంటి ట్విస్ట్లు ఇవ్వబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
KTR Nizamabad Tour: నేడే నిజామాబాద్కు మంత్రి కేటీఆర్.. శంకుస్థాపనలు, బహిరంగ సభ
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!