Yadadri MMTS: ప్రారంభమైన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులు.. గుట్ట వద్ద ప్రత్యేక ట్రాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri MMTS: హైదరాబాద్కే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలను దక్షిణ మధ్య రైల్వే విస్తరిస్తోంది. ఎంఎంటీఎస్ను ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాలకు విస్తరించారు. కాగా.. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటీఎస్ను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. ఎంఎంటీఎస్ సర్వీసులను యాదాద్రి వరకు పొడిగించే ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చును రైల్వే శాఖ భరిస్తుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ డీఆర్ఎం ఏకే గుప్తాతో కలిసి ఇటీవల యాదాద్రి రైల్వేస్టేషన్ను పరిశీలించారు. ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రత్యేక రైల్వే ట్రాక్ నిర్మిస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న యాదాద్రి రైల్వే స్టేషన్కు ఎదురుగా కొండ వైపు మరో రైల్వే స్టేషన్ను నిర్మించనున్నారు. ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు.
Read also: Prabhas-Ram Charan: ఏదో ఒక రోజు రామ్ చరణ్తో సినిమా చేస్తా: ప్రభాస్
Also Read
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
యాదాద్రి ఆలయ నమూనాలో కొత్త రైల్వేస్టేషన్ ముఖద్వారం నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. యాదాద్రి వరకు ఇప్పటికే రెండు రైల్వే ట్రాక్లు ఉన్నాయి. కానీ ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ప్రత్యేక ట్రాక్ నిర్మిస్తారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తే అతి తక్కువ ధరకే భక్తులు ప్రయాణించవచ్చు. యాదాద్రి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యాదాద్రికి హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. MMTS అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో హాయిగా ప్రయాణం చేయవచ్చు. 2016లోనే యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లో ప్రాజెక్టు అంచనా రూ.330 కోట్లు. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు సాకారం కాలేదు. ఇప్పుడు అంచనా వ్యయం రూ.430 కోట్లకు చేరగా.. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే శాఖ ఈ పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా యాదాద్రి రైల్వే స్టేషన్లను సర్వాంగ ఆధునీకరించనున్నారు. ఎంఎంటీఎస్ పూర్తయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాదాద్రికి 30 నిమిషాల్లో చేరుకోవచ్చు.
Warangal: కన్నీటి సంద్రంలో రైతన్న.. చెత్తకుప్పకు చేరిన లక్షలు విలువ చేసే టమాటా..!
తాజావార్తలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
-
US-Iran War: ‘ట్రంప్ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
-
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
-
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!