Yadadri MMTS: ప్రారంభమైన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులు.. గుట్ట వద్ద ప్రత్యేక ట్రాక్
Yadadri MMTS: హైదరాబాద్కే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలను దక్షిణ మధ్య రైల్వే విస్తరిస్తోంది. ఎంఎంటీఎస్ను ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాలకు విస్తరించారు. కాగా.. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటీఎస్ను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. ఎంఎంటీఎస్ సర్వీసులను యాదాద్రి వరకు పొడిగించే ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చును రైల్వే శాఖ భరిస్తుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ డీఆర్ఎం ఏకే గుప్తాతో కలిసి ఇటీవల యాదాద్రి రైల్వేస్టేషన్ను పరిశీలించారు. ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రత్యేక రైల్వే ట్రాక్ నిర్మిస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న యాదాద్రి రైల్వే స్టేషన్కు ఎదురుగా కొండ వైపు మరో రైల్వే స్టేషన్ను నిర్మించనున్నారు. ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు.
Read also: Prabhas-Ram Charan: ఏదో ఒక రోజు రామ్ చరణ్తో సినిమా చేస్తా: ప్రభాస్
Also Read
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
యాదాద్రి ఆలయ నమూనాలో కొత్త రైల్వేస్టేషన్ ముఖద్వారం నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. యాదాద్రి వరకు ఇప్పటికే రెండు రైల్వే ట్రాక్లు ఉన్నాయి. కానీ ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ప్రత్యేక ట్రాక్ నిర్మిస్తారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తే అతి తక్కువ ధరకే భక్తులు ప్రయాణించవచ్చు. యాదాద్రి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యాదాద్రికి హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. MMTS అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో హాయిగా ప్రయాణం చేయవచ్చు. 2016లోనే యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లో ప్రాజెక్టు అంచనా రూ.330 కోట్లు. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు సాకారం కాలేదు. ఇప్పుడు అంచనా వ్యయం రూ.430 కోట్లకు చేరగా.. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే శాఖ ఈ పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా యాదాద్రి రైల్వే స్టేషన్లను సర్వాంగ ఆధునీకరించనున్నారు. ఎంఎంటీఎస్ పూర్తయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాదాద్రికి 30 నిమిషాల్లో చేరుకోవచ్చు.
Warangal: కన్నీటి సంద్రంలో రైతన్న.. చెత్తకుప్పకు చేరిన లక్షలు విలువ చేసే టమాటా..!
తాజావార్తలు
-
Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
-
Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ – పూర్తి వివరాలు
-
Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
-
Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
-
Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!