Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
- హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల ప్రయాణ భారంపై చర్చ
- వర్క్ ఫ్రమ్ హోమ్తో కోట్లలో ఇంధన ఆదా
- ఉత్పాదకతపై కంపెనీల్లో భిన్నాభిప్రాయాలు
- దేశ ఆర్థిక వ్యవస్థకు WFH ఎంత కీలకం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పెరుగుతున్న ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుండే పని చేసే (Work From Home) విధానాన్ని పాటించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, దేశీయ ఐటీ హబ్లలో ఒకటైన హైదరాబాద్పై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం సుమారు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ ఉద్యోగులు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి ప్రతిరోజూ సగటున 50 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణం వల్ల అటు ట్రాఫిక్ సమస్యలు పెరగడమే కాకుండా, భారీగా ఇంధనం ఖర్చవుతోంది. ప్రధాని సూచన మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
హైదరాబాద్ ఐటీ రంగంలో ఈ విధానం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలపై ప్రాథమిక అంచనాలు వెలువడ్డాయి. నగరంలోని మొత్తం ఐటీ ఉద్యోగులలో కనీసం సగం మంది, అంటే సుమారు 4.5 లక్షల మంది వారానికి కేవలం మూడు రోజులు ఇంటి నుండి పని చేసినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నెలకు దాదాపు 140 కోట్ల రూపాయల విలువైన ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు.
కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం విజయవంతంగా అమలు జరిగినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద కంపెనీలు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తుండగా, కొన్ని చిన్న స్థాయి సంస్థలు మాత్రం ఈ విధానం వల్ల తమ ఉత్పాదకత దెబ్బతింటుందని లేదా ఇతర నష్టాలు వస్తాయని ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం నుండి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ వచ్చేలా లేదు.
కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కాకుండా, పెట్రోల్ , డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ప్రోత్సహించడం కూడా అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి నుండే పని చేయడం వల్ల ఇంధన దిగుమతులు తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ పెరగడానికి తోడ్పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక భవిష్యత్తుకు ఈ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానం ఒక కీలక మలుపు కానుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?