Telangana: వైద్య రంగంలో అద్భుతం.. భర్త మరణించిన 11 నెలల తర్వాత మాతృత్వం
వైద్య రంగంలో అద్భుతం చోటు చేసుకుంది. జీవితంలో ఒక్కసారైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న ఓ మహిళ భర్త మరణించిన 11 నెలల తర్వాత మాతృత్వం పొందింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన ఓ జంటకు 2013లో వివాహం జరిగింది. అయితే పెళ్లయి ఏడేళ్లు దాటినా వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో వీళ్లు వరంగల్లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అదే ఏడాది ఏడాది మార్చిలో అక్కడి వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి భద్రపరిచారు. అయితే 2021లో భర్త కరోనా సోకి మరణించాడు.
దీంతో పిల్లలు కావాలని తపించిన 32 ఏళ్ల మహిళ భర్త మరణంతో కృంగిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె వైద్యులను సంప్రదించింది. ఆస్పత్రిలో భద్రపరిచిన భర్త వీర్యం ద్వారా తల్లిని కావాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ అంశంపై న్యాయపరమైన చిక్కులు రాకుండా కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకుంది. దీంతో గతంలో వైద్యులు భద్రపరిచిన వీర్యం ద్వారా మహిళకు 2021లో ఐవీఎఫ్ ద్వారా చికిత్స అందించారు. ఈ మేరకు ఈ చికిత్స విజయవంతం కావడంతో ఆమె ఈ నెల 11న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా భర్త మరణించిన 11 నెలల తర్వాత ఆమె మాతృత్వాన్ని పొందింది.
Also Read
https://ntvtelugu.com/young-girl-commited-suicide-because-of-whatsapp-status/
తాజావార్తలు
-
Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్రైజర్స్
-
Astrology: ఏప్రిల్ 30, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని శుభవార్తలు..
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?